Bigg Boss Telugu7: బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్లో మళ్ళీ వ్యవహారం కాస్త రసపట్టుగా మారింది. టాస్కులు పెరిగాయ్.. సిల్లీగా వున్నా, ఎంటర్టైనింగ్గా వుండడంతో ఒకింత ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతోంది బిగ్ బాస్ వ్యూయర్స్లో. కొత్త కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ మార్పు అనుకోవాలా.?
నిజానికి, కొత్త కంటెస్టెంట్లలో అంతగా రాణిస్తున్న కంటెస్టెంట్లు అంటే, అర్జున్ అంబటి, నయని పావని తదితరులే కనిపిస్తున్నారు. పూజా మూర్తి డల్గా వుంది. భోళే షావలి కూడా అంతే.. మాటలు తప్ప చేతల్లేవు. అశ్విని శ్రీ అయితే ఏడుపుగొట్తుతనానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది.
తాజా ఎపిసోడ్ సందర్భంగా జరిగిన టాస్కుల్లో కంటెస్టెంట్ల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. శోభా శెట్టి – గౌతమ్, మోనిత – పూజా మూర్తి మధ్య రచ్చ చోటు చేసుకుంది. తప్పు శోభా శెట్టిదే ఒకటికి రెండు సార్లు తేలింది. కానీ, బుకాయించడంలో శోభా శెట్టి గురించి కొత్తగా చెప్పేదేముంది.?
శోభ తీరుపై పూజా మూర్తి అసహనం వ్యక్తం చేసింది. శోభా చేస్తున్న ర్యాగింగ్ పట్ల బాగా అప్సెట్ అయ్యింది పూజా మూర్తి. కంటతడి కూడా పెట్టింది. పూజా మూర్తికి భోళే షావలి నుంచీ తలనొప్పి ఎదురయ్యింది. ఈ క్రమంలో పూజా మూర్తి మెంటల్గా సిక్ అయినట్లు కనిపించింది.
‘మా నాన్న కోసం వచ్చా.. ఫోకస్డ్గా ఆడతా..’ అని చెప్పిందిగానీ, ఆమెలో అంత ఎనర్జీ అస్సలు కనిపించడంలేదు. ఓ టాస్క్లో హడావిడి చేసి, అమర్ దీప్ కొంత యాక్టివ్ అయ్యాడు. మరోపక్క, తాను ఈ వారం ఎలిమినేట్ అయిపోతానంటూ అశ్విని ఫిక్సయిపోయింది. తనకు పది రోజులకు పైనే టైమ్ వుందని భోళే షావలి చెప్పాడు. వచ్చేవారం సత్తా చాటుతానన్నాడు.
కాగా, తాను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాననీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా అంతే వీరాభిమానమని డాన్స్ మాస్టర్ సందీప్ చెప్పడం గమనార్హం. రెండు గ్రూపులుగా విడిపోయిన హౌస్ మేట్స్, బిగ్ బాస్ ఇచ్చిన తాజా టాస్కుల్లో చెరి మూడు ట్యాగ్స్ దక్కించుకుని, సమానంగా నిలిచారు.