అసలు శివాజీ ఎందుకు త్యాగం చేశాడు.? తేజని ఎందుకు అనవసరంగా రేసు లోంచి ప్రియాంక తప్పించినట్టు.? సందీప్ ఎందుకంత ఓవరాక్షన్ చేశాడు.? పల్లవి ప్రశాంత్కి అన్నిసార్లు ఎందుకు ప్రియాంక ‘అవకాశాలు’ కల్పించినట్లు.?
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ తొలి కెప్టెన్గా అవతరించాడు ‘కామన్ మేన్’ అలాగే ‘మట్టి మనిషి’ పల్లవి ప్రశాంత్. ఏమో, ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకోబోతున్నాడేమో. పరిస్థితులు చూస్తోంటే, అలాగే కనిపిస్తున్నాయి.
అసలు బిగ్ హౌస్లో శివాజీ వున్నదే, పల్లవి ప్రశాంత్ని ఎలివేట్ చేయడానికి అన్నట్లుంది పరిస్థితి. ప్రతిసారీ పల్లవి ప్రశాంత్ని వెనకేసుకొస్తున్నాడు శివాజీ. ఈ క్రమంలో మిగతా హౌస్ మేట్స్ చుట్టూ, తనదైన కుట్రపూరితమైన వల విసురుతున్నాడు. అందులో చిక్కుకుని మిగతా కంటెస్టెంట్లు విలవిల్లాడుతున్నారు.
చిత్రంగా హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా, శివాజీకి ఫుల్ సపోర్ట్. ఇంకేముంది.? కథ అంతా శివాజీ అనుకున్నట్టు, శివాజీ చుట్టూనే తిరుగుతోంది. పోనీ, శివాజీ ఏమన్నా ఆట సరిగ్గా ఆడుతున్నాడా.? అంటే, భుజం నొప్పి అనీ.. కాలి నొప్పి అనీ.. ఇంకో నొప్పి అనీ.. పక్కన కూర్చుంటున్నాడు.
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రంగులు కొట్టుకున్నారు రేసులో నిలిచిన నలుగురు కంటెస్టెంట్లు తేజ, పల్లవి ప్రశాంత్, సందీప్, గౌతమ్ కృష్ణ. సందీప్ అనవసరమైన అగ్రెసివ్నెస్ ప్రదర్శించాడు. పల్లవి ప్రశాంత్ గట్టిగా ఆడిందేమీ లేదుగానీ, అతనికి అవకాశాలు కల్పించింది సంచాలక్ ప్రియాంక.
సంచాలక్ ప్రియాంక వల్లనే తేజ ఔట్ అయ్యాడు. సందీప్ ఓ సారి ప్రియాంక వల్ల బతికిపోయాడుగానీ, రెండోసారి ఆ ఛాన్స్ అతనికి దొరకలేదు. చివరికి జరగాల్సిందే జరిగింది.. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడు. ఈ మాత్రందానికి ఎందుకింత హైడ్రామా.? తొండాట కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్ అంతే.!