కరోనాకు మందు ఎలా కనిపెట్టాలనో అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటుంటే కొందరు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. అవి మామూలు ఉత్పత్తులు కాదు.. ఏకంగా కరోనాకు విరుగుడుగా దుస్తులను తయారు చేస్తున్నారు. ఈ దుస్తులు వేసుకుంటే కరోనా దరిచేరదని అంటున్నారు. దీనిని కోటు రూపంలో తయారు చేసామని ఉత్పత్తిదారులు అంటున్నారు.
ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. స్విట్జర్లాండ్ టెక్స్టైల్ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద ముంబయి బేస్డ్ డోనియర్ ఇండస్ట్రీస్ ఈ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ ఫ్యాబ్రిక్ కేవలం అరగంటలో కరోనా వైరస్ నిర్మూలిస్తుందని డోనియర్ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. హీక్యూ వైరోబ్లాక్ ఎన్పిజె03 టెక్నాలజతో ఈ దుస్తులు తయారవుతాయని సీఎండీ రాజేంద్ర అగర్వాల్ అంటున్నారు.
మెల్బోర్న్లోని డోహెర్టీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన పరిక్షల్లో తమ దుస్తులు కరోనాను 99.99 శాతం నిరోధించినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం వీటిని అమెరికాలోని మెడికల్ టెక్స్టైల్ కంపెనీకి భారతదేశంలోని కొన్ని పోలీసు విభాగాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం యాంటీ-వైరల్ డ్రెసెస్ విభాగంలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, ఊలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచామన్నారు.
యూనిఫాంలు, జాకెట్లు, సూట్లు, ప్యాంటు, షర్టుల రూపంలో దీన్ని ధరించొచ్చని అంటున్నారు. ప్రత్యేకమైన రసాయనాన్ని ఉపయోగించడం వల్ల ఉతికినా దీని ప్రభావం పోదంటున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రిటైల్ కౌంటర్లలో ఈఏడాదే అందుబాటులో ఉంటాయన్నారు. ధర కాస్త ఎక్కువగా ఉన్నా ఈ కోటు వల్ల ఉపయోగం ఎక్కువని అంటున్నారు.
685124 144129some truly fascinating information , nicely written and broadly speaking user genial . 825245
999596 771802How significantly of an exciting piece of writing, continue creating companion 114204