ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమంటూ మరో సర్వే వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ రెండింటిలోనూ ఆ పార్టీ హవా కొనసాగుతుందని పేర్కొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ 121 నుచి 130 అసెంబ్లీ సీట్లతోపాటు 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వే వెల్లడించింది.
అధికార తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 54 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని వివరించింది. సీపీఎస్ సంస్థ కు సర్వే నిర్వహణలో జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. 2009 నుంచి ఈ సంస్థ చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా సీపీఎస్ సంస్థ చెప్పిన విధంగానే వచ్చాయి.
ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 94 నుంచి 104 స్థానాలు వస్తాయని చెప్పగా.. ఆ పార్టీ 88 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. అలాగే మహాకూటమి 16 నుంచి 21 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పగా.. కాంగ్రెస్ 19, టీడీపీ 2 చోట్ల మాత్రమే గెలుపొందాయి. మిగిలిన సర్వేలన్నీ మహాకూటమికే అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. సీపీఎస్ ఒక్కటే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని పేర్కొంది.
అలాంటి సంస్థ ఏపీలో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై రెండు దశల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి 17-21 మధ్య, మార్చి 27-31 మధ్య రెండు విడతలుగా దాదాపు 7.41 లక్షల శాంపిల్స్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది.
2014తో పోలిస్తే ఈ సారి వైసీపీకి 8 శాతం ఓట్లు అధికంగా వస్తాయని వివరించింది. గత ఎన్నికల్లో కేవలం 1.6 శాతం ఓట్లు తక్కువ రావడంతో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అయితే, ఈ సారి 8 శాతం ఓట్లు ఎక్కువ రానున్న నేపథ్యంలో సీట్లు కూడా భారీగా పెరుగుతాయని విశ్లేషించింది.
మొత్తమ్మీద వైసీపీ 48.1 శాతం ఓట్లతో 121 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని, తెలుగుదేశానికి 40.1 శాతం ఓట్లతో 45 నుంచి 54 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు 8 శాతం ఓట్లు వచ్చినప్పటికీ, సీట్లు మాత్రం ఒకటి లేదా రెండుకు మించి రావని స్పష్టంచేసింది.
ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని పేర్కొంది. విశ్వసనీయత విషయంలో కూడా జగన్ కు ఏకంగా 90 శాతం మంది ఓటేయగా.. చంద్రబాబు పట్ల కేవలం 10 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారని తెలిపింది. జగన్, కేసీఆర్, మోదీ ఒకటేనంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం జనాల్లో ఏమీ ప్రభావం చూపడంలేదని తేలినట్టు వివరించింది.
అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం జనాల్లో ఉండటంతోపాటు జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నట్టు సీపీఎస్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక ఎంపీ సీట్లలోనూ వైసీపీదే హవా అని తేలింది. ఆ పార్టీ 21 స్థానాలు సాధించి కీలకంగా మారుతుందని సర్వే పేర్కొంది.
తెలుగుదేశం పార్టీ 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వివరించింది. పసుపు కుంకుమ పథకం ప్రభావం డ్వాక్రా సంఘాల మహిళల్లో కాస్త కనిపిస్తోందని, దాదాపు 44 శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉండగా.. వైఎస్సార్ సీపీ పట్ల 45.2 శాతం మొగ్గు చూపుతున్నారని పేర్కొంది.
571552 139127Right after study some of the weblog posts on your personal web site now, we truly like your way of blogging. I bookmarked it to my bookmark web website list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware in the event you agree. 749272
397348 837466Billiard can be a game which is mostly played by the high class men and women 208511
916661 242738I was looking at some of your blog posts on this website and I believe this internet web site is real instructive! Maintain posting . 408704