సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. మహేష్ 26వ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అంటూ ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ సందర్బంగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. సమ్మర్ లో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుందని అంతా ఎదురు చూస్తుండగా సినిమా క్యాన్సిల్ అంటూ వార్తలు వచ్చాయి.
మహేష్బాబు 27వ చిత్రం దర్శకుడు ఎవరు అనే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మహేష్బాబు ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురు దర్శకులు ప్రస్తుతం మహేష్బాబుకు కథ వినిపించేందుకు క్యూలో ఉన్నారు. ఇదే సమయంలో వంశీ పైడిపల్లి కూడా మహేష్బాబుతో సినిమా చేస్తున్నట్లుగానే చెప్పుకుంటున్నాడు.
మహేష్బాబుతో ఆయన 27వ సినిమా కాకుంటే 28వ సినిమా లేదంటే 30వ సినిమా. సినిమా ఎప్పుడో తెలియదు కాని ఖచ్చితంగా తన తదుపరి చిత్రం మహేష్బాబుతోనే అంటూ చాలా గట్టిగా నమ్మకంగా వంశీ పైడిపల్లి చెబుతున్నాడు. మొన్నటి వరకు చెప్పిన గ్యాంగ్ స్టర్ కథ నచ్చక పోవడంతో మరో కథను సిద్దం చేసే పనిలో వంశీ పైడిపల్లి పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
465910 748703very good post, i undoubtedly adore this remarkable internet site, carry on it 482719
155981 881738Dead written articles , Truly enjoyed reading . 967674