మొన్నామధ్య నాసా ఓ అధ్యయాన్ని విడుదల చేసింది. అందులో భారతదేశంలోని కొన్ని తీర ప్రాంత నగరాలు సముద్రుడి ఆగ్రహానికి గురికాక తప్పదని తేల్చారు నిపుణులు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశం మాత్రమే కాదు, చాలా దేశాల్లో తీర ప్రాంతాలకు ముప్పు పొంచి వుందన్నది బహిరంగ రహస్యం.
రోడ్లపై వాహనాలు పెరుగుతున్నాయ్.. ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయ్.. చెప్పుకుంటూ పోతే, భూమి వేడెక్కిపోవడానికి మనిషి చెయ్యని పనంటూ లేదు. చెట్లను నరికేస్తున్నాం, అడవుల్ని నాశనం చేసేస్తున్నాం. దాంతో, మంచు వేగంగా కరిగిపోతోంది.. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. విశాఖ తీరానికి ముప్పు పొంచి వుందనే హెచ్చరికలు బయటకు రాగానే, అంతా తూచ్.. అంటూ కొన్ని రాజకీయ విమర్శలు తెరపైకొచ్చాయి. విశాఖ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ తీర ప్రాంత నగరమైనా, పట్టణమైనా, గ్రామమైనా సముద్రుడి దెబ్బకు విలవిల్లాడాల్సిందే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. అంతలోనే, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ముందుకొస్తున్నాడు. పౌర్ణమి, అమావాశ్య సమయాల్లో ఇలాంటివి మామూలేనని కొందరు అభిప్రాయపడుతుండగా, సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఎందుకు తలెత్తుతోందన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
2 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్ళడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తీర ప్రాంతాల్లో పెరిగిపోతున్న పోర్టులు, అదే సమయంలో.. సముద్ర గర్భంలో చమురు అన్వేషణ, తీర ప్రాంతాల్లోంచి చమురు లాగేస్తూ, నేలని గుల్ల చేసేస్తుండడం, వీటికి తోడు చేపలు, రొయ్యల పెంపకం కోసం పచ్చని పాలాల్నీ, తీరానికి రక్షణ ఇచ్చే చెట్లనీ, మడ అడవుల్నీ నరికేస్తుండడం… ఇవన్నీ మానవ తప్పిదాలే.
నష్టం 70 ఏళ్ళలో జరగొచ్చని నాసా చెప్పింది. కానీ, మనం అంత ఆలస్యం చెయ్యం.. అందులో సగం వంతు సమయంలోనో, పావు వంతు సమయంలోనే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదే కాదు.. యావత్ మానవాళిదీ ఈ సమస్య.
546361 764401my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 592563