ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ సర్కార్ గత కొంతకాలంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న విషయం విదితమే. రాజధాని మార్పుపై వైసీపీ సర్కార్ పంపుతోన్న సంకేతాలు ఇంకాస్త బలంగా విన్పిస్తున్నాయిప్పుడు. అతి త్వరలో కొత్త రాజధానిపై వైఎస్ జగన్ సర్కార్ అధికారిక ప్రకటన చేయబోతోందట. ప్రస్తుతం రాజధానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ, తన పనుల్ని తెరవెనుకాల చకచకా చక్కబెట్టేస్తోంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ కమిటీ పర్యటించబోతోందట. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి, ప్రజలందరితోనూ చర్చించి, ప్రజలందరికీ అమోదయోగ్యమైన రాజధాని దిశగా ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు.
ఎలాగైతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానానికి సహకరించారో.. ఇప్పుడు అదే రీతిలో వైఎస్ జగన్ సర్కార్కి రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. ఇక, బొత్స వ్యాఖ్యల్లో ‘లక్ష ఎకరాల భూమిని రాజధాని కోసం ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా వున్నారు’ అనే మాట రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
‘చంద్రబాబుని నమ్మి 33 వేల ఎకరాల భూమిని అమరావతి ప్రజలు ఇచ్చారు కదా..’ అన్న ప్రశ్నకు బొత్స సత్యనారాయణ ఇచ్చిన రిటార్ట్ అది. అంటే, పరోక్షంగా బొత్స సత్యనారాయణ తమ ప్రభుత్వానికి లక్ష ఎకరాల స్థలంలో రాజధానిని నిర్మించాలనే ఆలోచన వుందన్న విషయాన్ని బయటపెట్టినట్లే భావించాలి.
ఇంతకీ, ఆ లక్ష ఎకరాలు ఎక్కడ అందుబాటులో వుంది.? నిజానికి, లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం సాధ్యమేనా.? కొత్త రాజధాని విషయమై వైసీపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఎప్పుడొస్తుందా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
699082 264211There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in features also. 872368
911488 942852I got what you intend,bookmarked , quite decent website. 993898
219369 911349Wow, awesome weblog structure! How long have you been running a blog for? you made blogging look simple. The total look of your site is fantastic, let alone the content material! 918198