అమ్మకి తిండి పెట్టలేనోడు, పిన్నమ్మకి వడ్డాణం చేయిస్తానన్నాడట.! ఔను, ‘ఒకే రాజధాని – మూడు రాజధానులు’ వ్యవహారంలో అధికార పార్టీ తీరు ఇలాగే వుంది మరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగించడం చేతకావట్లేదుగానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. జ్యుడీషియల్ క్యాపిటల్.. అంటూ అధికార పార్టీ కట్టు కథలు చెబుతోంటే, రాష్ట్ర ప్రజానీకం ఎలా నమ్మేస్తున్నారో ఏమో.!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి.? ఒక్క రాజధానికే దిక్కులేనప్పుడు, మూడు రాజధానుల నిర్ణామెలా సాధ్యం.? అన్న సోయ, కాస్తంతైనా రాష్ట్ర ప్రజల్లో లేకపోవడ నిజంగానే ఆశ్చర్యకరం. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా.. రాష్ట్ర ప్రజలెవరూ, రాజధాని అనేది తమ ఆత్మగౌరవం అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు. బహుశా, ఇంకా హైద్రాబాదే తమ రాజధాని అన్న భ్రమల్లో రాష్ట్ర ప్రజలు వున్నారేమో.!
చంద్రబాబు ఎలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారు.? అన్నది వేరే చర్చ. రాష్ట్రానికి రాజధాని వుండాలా.? వద్దా.? రాజధాని చుట్టూ ఏడాదిగా గందరగోళం చోటు చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏడాదిగా రాష్ట్రానికి రాజధాని లేదు. కానీ, అలా జనం ఆలోచించడమే లేదు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఏడుస్తున్నారు, ఛస్తున్నారు.. మాకెందుకు.? అన్నట్టుంది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల తీరు.
పక్కోడికి నొప్పి వస్తే, ‘మాకేంటి సంబంధం’ అన్నట్లు వదిలేస్తున్నారుగానీ, రేప్పొద్దున్న అదే దెబ్బ తమకీ తగలబోతోందని ఎందుకు అనుకోవడంలేదో.! తనదాకా వస్తేనేగానీ తలనొప్పి సంగతి తెలియదన్నట్లు.. ఆ ముచ్చట అటు విశాఖకీ, ఇటు కర్నూలుకీ ఎదురైతే తప్ప.. అక్కడి ప్రజలకీ వాస్తవం తెలిసిరాదేమో.! ‘మూడు రాజధానులకు విపక్షాలు అడ్డుపడుతున్నాయి..’ అనే కుంటి సాకుని ముందుగా ప్లాన్ చేసుకుని, అధికార పార్టీ ఈ నాటకానికి తెరలేపిందని.. ఇటీవలి పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది.
రాజధాని అమరావతి నిర్మాణం అధికార వైసీపీకి చేతకాదు. అది ఓపెన్ సీక్రెట్. ఆ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అత్యంత వ్యూహాత్మకంగా మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రం అభివృద్ధి అనే సోయ ఎవరికీ లేకుండా పోయింది. అంటే అధికార పార్టీ ‘పాచిక’ పారినట్లేనన్నమాట.
కేవలం హైద్రాబాద్ నుంచే అత్యధిక శాతం ఆదాయం తెలంగాణకు వస్తోంది. చెన్నయ్ నుంచి తమిళనాడుకీ, బెంగళూరు నుంచి కర్నాటకకీ.. ఇలా చెప్పుకుంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. చిన్నదో పెద్దదో.. రాజధాని అమరావతిని పూర్తి చేసి వుంటే, రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే నగరం అయి వుండేది.
చంద్రబాబు మీద కోపమా.? లేదంటే, రాష్ట్ర ప్రజల మీద కోపమా.? ఏమోగానీ, 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలనూ వైసీపీకి కట్టబెట్టడమే బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన ఘోర తప్పిదమయి వుంటుంది. చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగని అన్యాయం బహుశా అమరావతి విషయంలో జరిగి వుంటుంది. చంద్రబాబు చేసిన తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నారు. అది ముగిసిపోయిన చరిత్ర. ఆ పేరు చెప్పి, రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో చావు దెబ్బ కొట్టడం అధికార వైసీపీకి అస్సలేమాత్రం సబబు కాదు.
778672 541107I adore the appear of your website. I lately built mine and I was looking for some design suggestions and you gave me a few. Could I ask you whether you developed the web site by youself? 418402
75089 599533Um, take into consideration adding pictures or far more spacing to your weblog entries to break up their chunky appear. 870490
580185 202315hi and thanks for the actual weblog post ive lately been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 825765
728744 441104What a excellent viewpoint, nonetheless is just not produce every sence by any means discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an issue in your blogging is it possible you must recheck this. thank you just as before. 910958