‘‘కాంతార’ ఏ హాలీవుడ్ సినిమాలు చూసి తీసిన సినిమా కాదు. మట్టిలోంచి పుట్టిన కథ. రిషిబ్ నటనకు ముగ్దుడినయ్యాను. అందుకే సినిమాను తెలుగులో విడుదల చేశాం. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చాం’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార సినిమాను అదే పేరుతో ఈనెల 15న ఇక్కడా విడుదల చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ..
బన్నీవాసు ఈ సినిమాను కన్నడలో చూసి నన్నూ చూడమన్నాడు. సినిమా, రిషిబ్ నటన నన్ను ఆకట్టుకున్నాయి. తన ఊరికి సంబంధించిన విశేషాలను తెరపైకి తీసుకొచ్చిన రిషిబ్ ను అభినందిస్తున్నా. ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. త్వరలో గీతా ఆర్ట్స్ సంస్థలో హీరోగా చేసేందుకు రిషిబ్ అంగీకరించారు’ అని అన్నారు.
హీరో రిషిబ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఈ సినిమా విడుదలైన అయిదు రోజులకే 20 కోట్లు వసూళ్లు సాధించడం సంతోషంగా ఉంది. సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.
559175 736094Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Look complicated to far delivered agreeable from you! Nevertheless, how can we keep in touch? 628543