టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. రేప్పొద్దున్న ఏబీఎన్ రాధాకృష్ణ పరిస్థితి కూడా అంతేనా.? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ దూకుడు చూస్తోంటే, ఏబీఎన్ రాధాకృష్ణకి ఆ పరిస్థితి తప్పకపోవచ్చేమో అన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీద ఫోకస్ పెట్టిందన్నది నిర్వివాదాంశం.
మరోపక్క, షరామామూలుగానే ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రోజురోజుకీ మరింత ముదిరి పాకాన పడ్తున్నాయి. మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు అధికార పార్టీకి ఖచ్చితంగా తలనొప్పులు తెస్తాయి. నయానో భయానో మీడియా సంస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం అధికారంలో వున్నవారికి వెన్నతో పెట్టిన విద్య. అయితే, అది అన్ని సందర్భాల్లోనూ కుదరదు.
గడచిన ఐదేళ్ళలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పట్లో సాక్షి మీడియాపై టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది కూడా. ఇప్పుడు అదే పరిస్థితి ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీడియాకి వచ్చింది. సరైన సమయం కోసం వేచి చూస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కోసం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వ్యవహారం – ఏబీఎన్ కథనాల్ని టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది.
మంత్రి పేర్ని నాని నిన్న మీడియా సమావేశంలో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణని కడిగి పారేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. ప్రభుత్వం తరఫున కేసులు నమోదవుతాయా.? అధికారుల తరఫున కేసులు వేయిస్తారా.? పార్టీ తరఫున కేసుల వ్యవహారం నడుస్తుందా.? అన్నదానిపై స్పష్టత లేదుగానీ, అతి త్వరలోనే ఏబీఎన్ రాధాకృష్ణకి శ్రీముఖాలు అందేలానే కన్పిస్తున్నాయి పరిస్థితులు.
అయితే, ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొంటామని రాధాకృష్ణ అండ్ టీమ్ అంటోంది. అయితే, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటే.. ఆ తర్వాతి పరిణామాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
428646 543898I was suggested this blog by way of my cousin. Im no longer positive whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. Youre fantastic! Thanks! 888748