Switch to English

టీడీపీలో కేశినేని తిరుగుబాటు ఆరంభం మాత్రమేనా?!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఘోర ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా తేరుకోలేదు. కానీ.. అప్పుడే పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. నాయకత్వం బలహీనపడినపుడు.. అసంతృప్తి గళాలు స్వరం పెంచడం సహజం కనుక.. ఒక్కొక్కరుగా పార్టీలోని సీనియర్‌ నేతలు అధినాయకుడికి కోటరీగా మారిన వ్యక్తుల్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు పదును పెడుతున్నారు.

పార్లమెంటరీ పార్టీ విప్‌ పదవి ఇచ్చినందుకు విజయవాడ లోక్‌సభ తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని అలకబూనాడని.. పత్రికల్లో వస్తున్న వార్తల్లో పాక్షిక నిజం మాత్రమే దాగున్నది. కేశినేని నాని ఎప్పట్నుంచో ఏళ్ల చిగువున్న తన అసహనాన్ని అణచుకొంటూ వస్తున్నారు. అతని టార్గెట్‌ అదే జిల్లాకు చెందిన మాజీమంత్రి దేవినేని ఉమ. వీరిద్దరికీ ఆది నుంచి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. సీనియారిటీ విషయానికొస్తే దేవినేని ఉమ మహేశ్వరరావు 1999 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో క్యాబినెట్‌ మంత్రి అయ్యారు. నిజానికి, దేవినేని ఉమ రాజకీయ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగింది. 1998లో దేవినేని ఉమ సోదరుడైన దేవినేని రమణ వరంగల్‌ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో మరణించారు. రమణ సతీమణి భర్త మరణాన్ని తట్టుకోలేక 24 గంటల వ్యవధిలో ప్రాణాలు వదిలారు. అన్న, వదినలు మరణించడంతో.. ఆ కుటుంబం నుంచి దేవినేని ఉమకు నందిగామ టిక్కెట్‌ లభించింది. ఒకప్పుడు తమ కజిన్‌ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన వద్ద పిఏ తరహాలో పనిచేసిన దేవినేని ఉమకు కాలం కలిసొచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు.

ఇక, కేశినేని నానిది మొదట్నుంచీ స్థితిపరుల కుటుంబం. ప్రైవేటు బస్‌ ఆపరేటర్లుగా వారు బాగా సంపాదించారు. 2008లో మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో కేశినేని నాని చేరారు. కొన్ని నెలలకే అల్లు అరవింద్‌ సమీప బంధువు ముత్తంశెట్టి కృష్ణారావుతో ఏర్పడిన వివాదంతో.. పార్టీ నుంచి బయటకొచ్చారు. చిరంజీవి పార్టీ టిక్కెట్లు అమ్ముకొన్నాడంటూ కేశినేని నాని అప్పట్లో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. 2014 ఎన్నికలకు ముందు కేశినేని నాని తెలుగుదేశంపార్టీలో చేరి లోక్‌సభ టిక్కెట్‌ సాధించి ఎన్నికల్లో గెలిచి లోక్‌సభ సభ్యుడయ్యారు.

అయితే, కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో పెత్తనం విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దేవినేని ఉమ, కేశినేని నానిల మధ్య ఏర్పడ్డ ‘ఈగో’ సమస్యలు పోనుపోను పెద్దవయ్యాయి. ఒక పార్టీ కార్యక్రమంలో అందరిముందు కేశినేని నానిని దేవినేని ఉమ.. ”ఏమ్మా నాని” అని అన్నాడని.. తనను ‘అమ్మ’ అని ఉమ పిలవడం నచ్చని కేశినేని నాని.. అప్పట్నుంచీ అతన్ని పలకరించడం మానేశాడని అంటారు.

పార్టీ అధిష్టానం.. అంటే చంద్రబాబునాయుడు మాత్రం తన క్యాబినెట్‌లో కీలకమైన సాగునీటి రంగాన్ని చూస్తున్న దేవినేని ఉమ పక్షాన్నే నిలిచారు. అనేక భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో ఆ శాఖమంత్రిగా దేవినేని ఉమ సహకారం ముఖ్యమంత్రికి అవసరం కనుక చంద్రబాబు.. కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాల్లో మంత్రి ఉమ మాటే చెల్లుబాటు అయ్యేట్లు చూశారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఉమ గొల్లపూడిలోని తన సొంత ఇంట్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు.

ఇదికాక, ఇంకా నామినేటెడ్‌ పోస్టులు తదితర వ్యవహారాల్లో కూడా ఉమ వర్గానికే అధిక ప్రాధాన్యం లభించింది. ఇది.. జిల్లాలోని ఇతర నాయకులకు రుచించలేదు. కానీ.. ‘నాని|లా ఎవరూ సాహసించి బయట పడలేదు. ఇక.. చంద్రబాబు కోటరీలో ఎమ్మెల్సీగా ఉన్న తొండెపు దశరధ జనార్ధన్‌, స్టాక్‌ బ్రోకర్‌గా పనిచేసిన కుటుంబరావు, ఎమ్మెల్సీ చౌదరి తదితరులు చెప్పిన ‘రాంగ్‌ ఫీడింగ్‌’ వల్ల పార్టీ నష్టపోయిందన్న భావన చాలామందిలో ఉంది. వారందరూ దేవినేని ఉమకు సన్నిహితులు కావడంతో.. వారందరూ ఒక్కటేనని.. కేశినేని నాని లాంటివారు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో.. ప్రధాని నరేంద్రమోదీని మోతాదుకుమించి విమర్శలు చేయడంలో కోటరీ పాత్ర ఉందని, అది బెడిసికొట్టిందని.. అలాగే, దేవినేని ఉమ.. జగన్‌ను చాలా నీచంగా తిట్టాడని అది పార్టీకి నష్టం కలిగించిందని చాలామంది భావిస్తున్నారు.

తటస్థంగా ఉండనున్న ‘నాని’

అధినేత చంద్రబాబు నచ్చచెప్పినా.. కేశినేని నాని వైఖరిలో మార్పు లేదు. లోక్‌సభలో పార్టీ ‘విప్‌’ పదవిని నాని తిరస్కరించాడు. తెలుగుదేశం నుండి బయటకు పోనని ‘నాని’ చెబుతున్నది నిజం కావొచ్చు. అయితే, రాబోయే ఐదేళ్లల్లో అతను పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా తటస్థంగా ఉండిపోతాడని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. దానివల్ల.. కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి దగ్గరై.. నియోజకవర్గ అభివృద్ధి పనుల్ని శాంక్షన్‌ చేయించుకోవాలన్నది ‘నాని’ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇది ఆరంభం మాత్రమేనా?

తెలుగుదేశం పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అనేక మంది సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారు. సమయం కోసం వేచిచూస్తూ ‘కేశినేని నాని’లా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుణ్ణి అమరావతికి పరిమితం చేసి.. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలవనీయకుండా తమచుట్టూ తిపుపకొని ‘మేతమేసిన’ నాయకుల బాగోతాన్ని బయటపెడతాం.. అంటూ కొందరు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలు చేయి దాటి పోకుండా చూసేందుకే.. చంద్రబాబు తన విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరితో రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదన్నది వాస్తవం!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...