Switch to English

అన్నీ అమ్మేసుకుంటూ పోతే.. దేశానికి మిగిలేదేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘పోర్టులు అమ్మేస్తాం.. ఎయిర్ పోర్టులు అమ్మేస్తాం.. స్టీలు ప్లాంటులు అమ్మేస్తాం.. రహదార్లను కూడా అమ్మేస్తాం.. అలా చేయడం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది.. నిధులు సమకూరుతాయ్.. ఆయా రోడ్లు, పోర్టుల నిర్వహణ సమర్థవంతంగా వుంటుంది..’ అంటోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.

అంతేనా, ‘కుదిరితే అమ్మేస్తాం.. కుదరకపోతే మూసేస్తాం..’ అంటూ స్టీలు ప్లాంటు వ్యవహారంపై ఇటీవల కేంద్రం తెగేసి చెప్పిన విషయం విదితమే. అసలేం జరుగుతోంది దేశంలో.? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అన్నిటినీ అమ్మేయడం.. అనే బృహత్కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వెనుక అసలు కోణమేంటి.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి వుంది. అంతమాత్రాన, ప్రపంచ దేశాల్లో ఇలాంటి అమ్మకాలున్నాయా.? లేదే.! ప్రపంచం గతంలో అనేక ఆర్థిక విపత్తులు ఎదుర్కొన్నప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఆ ప్రభావానికి లోను కాలేదు. ఎందుకంటే, ఇక్కడి పరిస్థితులు వేరు. ఇక్కడి ప్రజల పని తీరు వేరు. అప్పట్లో మనం సగర్వంగా మన దేశం తాలూకు గొప్పతనం గురించి చెప్పుకున్నాం. ఇకపై ఆ పరిస్థితి వుండదు.

ఎక్కడో అమెరికాలో తుమ్మితే, ఇక్కడ భారతదేశం విలవిల్లాడిపోయే పరిస్థితి రావొచ్చు. ‘అమ్మేయడం లేదు.. లీజుకిస్తున్నాం..’ అంటూ కొందరు బీజేపీ నేతలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. 99 ఏళ్ళకు లీజు.. అంటే, దాన్ని ఎవడైనా లీజు అంటాడా.? అమ్మేయడం అంటాడా.? అన్నది ఇంకో వాదన. అన్నీ అమ్మేయాలన్న ఆలోచన చేస్తున్నారు.. ఆ తర్వాత అమ్ముకోవడానికి ఏమీ లేకపోతే, అప్పుడేం చేస్తారు.? అడుక్కు తినాల్సిన పరిస్థితే వస్తుందప్పుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

పెట్రోలు, డీజిల్ మీద అత్యంత దారుణంగా బాదేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అలా వచ్చే సొమ్ములతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్నది పాలకుల వాదన. అదే నిజమైతే, అప్పులెందుకు చేస్తున్నట్టు.? సిగ్గులేనితనం.. బాధ్యతారాహిత్యం.. ఇవి ఎప్పుడైతే పాలకుల్లో పెరిగిపోతాయో, అప్పుడిక సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.. దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...