Switch to English

సమాధులు చెప్పిన సత్యం: గల్వాన్ ఘర్షణల్లో 106 మంది చైనా సైనికుల మృతి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని డ్రాగన్ ఇప్పటికీ వెల్లడించలేదు. జూన్ 15న చైనా దొంగ దెబ్బ తీయడం.. దానికి ధీటుగా భారత సైనికులు స్పందించి డ్రాగన్ సేనలను ఊచకోత కోయడం తెలిసిందే. ఆ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి భారత్ తగిన విధంగా నివాళులు అర్పించింది.

అయితే, ఆ ఘటనలో పెద్ద ఎత్తున చైనా సైనికులు మరణించినా.. డ్రాగన్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం మాట అటుంచితే.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా వారి మృతదేహాలను అప్పగించలేకపోయింది.

తాజాగా దీనికి సంబంధించిన కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. సదరన్ జిన్ జియాంగ్ జిల్లాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 69316 యూనిట్ లో భారీగా సమాధులు ఉన్నాయి. ఇటీవలే నిర్మించిన ఆ సమాధులపై గల్వాన్ లో భారత్ తో జరిగిన పోరులో అమరులైన సైనికులు అని రాసి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడటంతో నాటి ఘర్షణల్లో చనిపోయినవారి లెక్క తెలిసింది.

ఓ బ్రిగేడియర్ ర్యాంకు అధికారి సహా మొత్తం 106 సమాధులు అక్కడున్నాయి. తమ సైనికులు ఎంతమంది చనిపోయో చైనా చెప్పకపోయినా.. అసలు సత్యాన్ని ఆ సమాధులు చెప్పాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాజ్యకాంక్షతో రగిలిపోతున్న చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్న డ్రాగన్ ఎత్తుకు పై ఎత్తు వేసింది. చైనా కు సమీపంలో ఆధునికమైన యుద్ధనౌకను మోహరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అత్యంత తెలివిగా మన యుద్ధనౌకను తరలించింది. ఈ ఆపరేషన్ మొత్తం చాలా రహస్యంగా సాగింది.

ఇప్పటికే ఆ జలాల్లో సంచరిస్తున్న అమెరికా యుద్ధనౌకలతో సమాచారాన్ని రహస్యంగా పంచుకుంటూ భారత యుద్ధనౌక అక్కడకు చేరింది. ఈ విషయం తెలియడంతో డ్రాగన్ షాక్ కు గురైంది. భారత్ ఇలాంటి సాహసోపేత చర్యకు పూనుకుంటుందని ఊహించని చైనా.. ఈ విషయాన్ని దౌత్య చర్చల్లో ప్రస్తావించింది. ఇది సరికాదని అసంతృప్తి వ్యక్తంచేసింది.

వాస్తవానికి దక్షిణ చైనా సముద్ర జలాలపై ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సహజవనరులపై కన్నేసిన చైనా.. అందులో సింహభాగం తనదేనని చైనా వాదిస్తుండగా.. సమీప దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో మన నౌకను అక్కడకు తరలించడం ద్వారా భారత సత్తా ఏమిటో డ్రాగన్ కు తెలియజెప్పినట్టయింది. ఇక అండమాన్ వద్ద కూడా భారత నౌకాదళం యుద్దనౌకలను మోహరించి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...