మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ క్రీడా సంగ్రామం మొదలవ్వబోతుంది. ఇండియాలో కరోనా తీవ్రత కారణంగా యూఏఈలో ఈసారి మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. అందుకోసం అన్ని జట్లు కూడా ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. ఈసారి మ్యాచ్ లు ఆడే ప్రతి ఒక్కరికి కూడా డోపింగ్ పరీక్షను నిర్వహించబోతున్నట్లుగా జాతీయ డోపింగ్ నిరోదక సంఘం పేర్కొంది. అందులో భాగంగా కోహ్లీ ధోనీతో సహా దాదాపు 50 మందిని కూడా పరీక్షించబోతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ పరీక్షలో భాగంగా ప్రతి ఒక్క ఆటగాడికి సంబంధించిన రక్తం మరియు మూత్రము సేకరించనున్నారు. మూడు దశల్లో ఈ పరీక్షలు ఉంటాయని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. క్రికెట్ ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఈసారి వేరే దేశంలో జరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. డోపింగ్ పై ఏమైనా అనుమానం వచ్చి ఉంటేనే ఈ పరీక్షలకు డోపింగ్ నిరోదక సంఘం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అంటున్నారు.
457369 267851Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and appear forward to new posts. 341008
684507 952646Just wanna remark which you have a very nice web website , I like the layout it really stands out. 153302