విశాఖ జిల్లా మధురవాడ మారికవలసలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ కేంద్రంలో 64 మంది కొవిడ్ రోగులున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
మారికవలస శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెుదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయగా… ఆ పై అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి మంటలు వచ్చాయి. అక్కడే ఉన్న కొవిడ్ సిబ్బంది వెంటనే స్పందించి.. కొవిడ్ బాధితులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. మంటలు అదుపు చేశారు. ఘటన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు, నార్త్ జోన్ ఏసీబీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు.
284718 374351Woh I like your weblog posts, saved to fav! . 937343