కాపురంలో కలహాలు రావడంతో విడిపోయారు ఆ భార్యాభర్తలు. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. కలిసుందామని భర్త అన్నాడు. భార్య ససేమిరా అంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను పట్టపగలే అందరిముందూ భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అత్యంత దారుణమైన ఈ సంఘటన బీహార్ లోని బక్సర్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని బ్రహ్మపూర్ కి చెందిన అల్గు యాదవ్ చత్తీస్ గడ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాకు చెందిన చాందినీ దేవి భర్యా భర్తలు. వీరిద్దరికీ 2013లో వివాహం అయింది. కొన్నాళ్లు వీరిద్దరి మధ్యా కాపురం సవ్యంగానే సాగింది. కొన్నేళ్లకు వీరిద్దరి మధ్యా మనస్పర్ధలు వచ్చాయి. దాదాపు మూడేళ్లు విడివిడిగానే ఉన్నారు. భర్త నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ తో వీరిద్దరి మధ్యా మళ్లీ గొడవలు మొదలయ్యాయి. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేసినా అందుకు ఒప్పుకోలేదు.
దీంతో భార్యపై యాదవ్ కోపం పెంచుకున్నాడు. ఆమె పని చేస్తున్న మాల్ కు వెళ్లాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను అందరూ చూస్తూండగానే నరికేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల మొండెం వేరు చేశాడు. చుట్టూ ఉన్నవారు యాదవ్ ను అడ్డుకోవడానికి అతనిపై రాళ్లు కూడా విసిరారు. అయినా ఉన్మాదంతో కసితీరా భార్యను చంపేశాడు. అనంతరం స్థానిక పోలిస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
66331 295058Wow ~ Good stuff ~ Come and have a look at MY ?? 74135
219866 849956Yay google is my king aided me to find this excellent site ! . 478746
218465 165882Discovering the proper Immigration Solicitor […]below you will locate the link to some sites that we believe you need to visit[…] 20946
477583 458766Most appropriate the human race messages work to show your and present exclusive chance with unique couple. Beginer appear system in advance of raucous folks will most likely always be aware most with the golden value off presentation, which is actually a persons truck. greatest man jokes 625684