Switch to English

3 క్యాపిటల్స్‌: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌ సర్కార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గవర్నర్‌ ఆమోదంతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే రద్దుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధపడగా.. హైకోర్టులో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో, ఈ నెల 14 వరకు ‘స్టేటస్‌ కో’ ఆదేశాలు జారీ అయిన విషయం విదితమే. అయితే, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

సోమవారం ఈ ‘ఎస్‌ఎల్‌పి’పై విచారణ జరిగే అవకాశం వుంది. సోమవారం అంటే ఈ నెల 10వ తేదీ అవుతుంది. అంటే, హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఆదేశాలు అప్పటికి ఓ నాలుగు రోజులు మాత్రమే అమల్లో వుంటాయన్నమాట. ‘అప్పటివరకు వేచి చూస్తే, హైకోర్టులోనే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేదమో.. ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాస్త తొందరపడినట్లే అన్పిస్తోంది..’ అన్న చర్చ కొందరు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. అయితే, వీలైనంత త్వరగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో వున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ముందుగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని అమరావతి నుంచి విశాకకు తరలించేయడానికి తొందరపడ్తోంది. కానీ, అలా తరలించాలంటే విశాఖలో అందుకు అనుకూలమైన భవనాల ఎంపిక ఈపాటికే జరిగిపోయి వుండాలి.

‘త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారు..’ అని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన దరిమిలా.. మళ్ళీ రాజధాని కోసం అన్నీ కొత్త నిర్మాణాలే అవసరమయ్యేలా వుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విశాఖ సంగతి సరే.. కర్నూలు మాటేమిటి.? కర్నూలులో పెడతామన్న జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ పరిస్థితేంటి.? దీనికి పెద్ద కథే వుంది. హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో వుండదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఆమోదం.. ఇలా చాలా వ్యవహారాలే వుంటాయి. ఎవరి వాదనలు ఎలా వున్నా, మూడు రాజధానుల విషయంలో తమది ముందడుగే తప్ప, వెనుకడుగు ప్రసక్తే లేదని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. అయితే, మరోమారు సుప్రీంకోర్టులో ‘మొట్టికాయలు’ తప్పవు.. అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...