Switch to English

అరగంటలో కోవిడ్‌ బెడ్‌.. ఏపీలో సాధ్యమేనా జగన్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటేశాయి. గత కొద్ది రోజులుగా దేశంలో అత్యధికంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. టెస్టుల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ ముందంజలోనే వున్నా, కొత్త కేసుల నమోదు.. కొత్త మరణాల నమోదులోనూ అదే వేగం కన్పిస్తుండడం దురదృష్టకరం. రాష్ట్రంలో కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రుల్లో వసతుల లేమి, ఇతరత్రా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు, మీడియా కథనాలు వెలుగు చూస్తున్న విషయం విదితమే. అయితే, కరోనా వైద్య చికిత్సలో చాలా రాష్ట్రాలకు తాము ఆదర్శంగా వున్నామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

తాజాగా కరోనా వైరస్‌ విషయమై అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాతో బాధపడుతున్న వ్యక్తి కోవిడ్‌ ఆసుపత్రిలో బెడ్‌ కావాలని కోరితే, అరగంటలో బెడ్‌ సమకూర్చాలి’ అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేయడమే కాదు, ఆ పరిస్థితి లేకపోతే దానికి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని అన్నారు. అంతేనా, ‘అది మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం.. మనం వారికి తగిన వైద్యం అందించలేకపోతే అది నేరం కిందే లెక్క..’ అని అభిప్రాయపడ్డారు వైఎస్‌ జగన్‌.

అయితే, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులేంటి.? అన్నది ముఖ్యమంత్రి జగన్‌కి తెలియదని ఎలా అనుకోగలం.! సమయానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలో ఓ కరోనా బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన వైనం గురించి చూశాం. సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడంతో ఓ కరోనా బాధితుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోతే, గంటల తరబడి అతన్ని ఎవరూ తాకడానికి కూడా వెనుకాడారు. ఇక, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోందిగానీ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాస్క్‌ ధరించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు అందిస్తామంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఇప్పటిదాకా ఎంతమందికి ఆ ఉచిత మాస్క్‌లు అందాయి.? అన్నదానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు మెదపట్లేదు.

ఇవన్నీ ఓ ఎత్తు.. అధికార పార్టీ నేతలు, కరోనా నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుండడం వల్ల కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలూ లేకపోలేదు. మొత్తమ్మీద, మాటలు కోటలు దాటుతున్నాయ్‌.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...