కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో కేంద్రం సంపూర్ణ లాక్డౌన్ని ప్రకటించింది. చాలా రాష్ట్రాలు కట్టుదిట్టంగా లాక్డౌన్ని పాటించాయి కూడా. ఆ తర్వాత క్రమక్రమంగా లాక్డౌన్ నుంచి సడలింపులు వచ్చాయి. ప్రస్తుతం ‘అన్ లాక్ 2’ నడుస్తోంది. చిత్రమేంటంటే, పదుల్లో కేసులున్నప్పుడు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించి, వేలల్లో కేసులు పెరిగాక లాక్ డౌన్ని క్రమక్రమంగా ఉపసంహరిస్తూ వస్తున్నారు.
‘దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని.. ప్రజల జీవన చక్రాన్ని దృష్టిలో పెట్టుకుని’ అని చెబుతూ, కేంద్రం ‘లాక్డౌన్’ ఉపసంహరణకు శ్రీకారం చుట్టింది. అయితే, దేశంలో పరిస్థితి రోజురోజుకీ అత్యంత దారుణంగా తయారవుతోంది. ఏ క్షణాన అయినా, రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటేయొచ్చు. అది 40 వేలకు.. ఆపైన చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.సగటున రోజువారీ కేసులు రెండున్నర లక్షలు కూడా నమోదయ్యే పరిస్థితులు ముందు ముందు వున్నాయని పలు నివేదకలు చెబుతున్నాయి. మరి, లాక్డౌన్ నుంచి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నట్లు.?
ప్రభుత్వాలు ఇస్తోన్న మినహాయింపుల్ని పక్కన పెడితే, సాధారణ ప్రజానీకంలో ‘కొందరు’ కరోనాని చూసి బెంబేలెత్తుతున్నారు. మరికొందరు, అసలు కరోనా కబళించేస్తోన్న విషయాన్నే పట్టించుకోకుండా తిరిగేస్తుండడం గమన్హాం. కాగా, దేశంలోని పలు నగరాల్లో అధికారిక లాక్డౌన్లు.. స్వచ్ఛంద లాక్డౌన్లు పెరుగుతున్నాయి. ఆ మధ్య చెన్నయ్లో కొన్ని రోజులపాటు లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరులో లాక్డౌన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తిరుపతిలో వ్యాపారులు ‘స్వచ్ఛంద లాక్డౌన్’కి సిద్ధమయ్యారు. గుంటూరులోనూ పరిస్థితి ఇలాగే వుంది. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు.?
దేశంలో హెల్త్ ఎమర్జన్సీ నడుస్తోంది. కరోనాతో ఎవరైనా చనిపోతే, అంత్యక్రియలు ‘పద్ధతి ప్రకారం’ చేయలేని దుస్థితి. మృతదేహాల్ని అమానవీయంగా పూడ్చిపెడుతున్న, తగలబెడ్తున్న వైనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ‘ఎవడి చావు వాడే చావండి..’ అన్నట్లుగా ప్రజల్ని గాలికొదిలేసినట్లే కన్పిస్తోంది. టెస్టుల సంఖ్య పెరుగుతోంది.. మంచిదే. కానీ, ప్రజలకు భరోసా ఇవ్వడంలేదెందుకు.? కరోనా నుంచి బయటపడ్డవారి ద్వారా ప్రచారం చేయిస్తే.. ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది. కానీ, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపించకపోవడం ఆశ్చర్యకరమే.
573205 975897I genuinely treasure your function , Great post. 886562