Switch to English

సెల్ప్‌ లాక్‌ డౌన్‌: ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి నెలలో కేంద్రం సంపూర్ణ లాక్‌డౌన్‌ని ప్రకటించింది. చాలా రాష్ట్రాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ని పాటించాయి కూడా. ఆ తర్వాత క్రమక్రమంగా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వచ్చాయి. ప్రస్తుతం ‘అన్‌ లాక్‌ 2’ నడుస్తోంది. చిత్రమేంటంటే, పదుల్లో కేసులున్నప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించి, వేలల్లో కేసులు పెరిగాక లాక్‌ డౌన్‌ని క్రమక్రమంగా ఉపసంహరిస్తూ వస్తున్నారు.

‘దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని.. ప్రజల జీవన చక్రాన్ని దృష్టిలో పెట్టుకుని’ అని చెబుతూ, కేంద్రం ‘లాక్‌డౌన్‌’ ఉపసంహరణకు శ్రీకారం చుట్టింది. అయితే, దేశంలో పరిస్థితి రోజురోజుకీ అత్యంత దారుణంగా తయారవుతోంది. ఏ క్షణాన అయినా, రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటేయొచ్చు. అది 40 వేలకు.. ఆపైన చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.సగటున రోజువారీ కేసులు రెండున్నర లక్షలు కూడా నమోదయ్యే పరిస్థితులు ముందు ముందు వున్నాయని పలు నివేదకలు చెబుతున్నాయి. మరి, లాక్‌డౌన్‌ నుంచి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నట్లు.?

ప్రభుత్వాలు ఇస్తోన్న మినహాయింపుల్ని పక్కన పెడితే, సాధారణ ప్రజానీకంలో ‘కొందరు’ కరోనాని చూసి బెంబేలెత్తుతున్నారు. మరికొందరు, అసలు కరోనా కబళించేస్తోన్న విషయాన్నే పట్టించుకోకుండా తిరిగేస్తుండడం గమన్హాం. కాగా, దేశంలోని పలు నగరాల్లో అధికారిక లాక్‌డౌన్‌లు.. స్వచ్ఛంద లాక్‌డౌన్లు పెరుగుతున్నాయి. ఆ మధ్య చెన్నయ్‌లో కొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరులో లాక్‌డౌన్‌ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తిరుపతిలో వ్యాపారులు ‘స్వచ్ఛంద లాక్‌డౌన్‌’కి సిద్ధమయ్యారు. గుంటూరులోనూ పరిస్థితి ఇలాగే వుంది. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు.?

దేశంలో హెల్త్‌ ఎమర్జన్సీ నడుస్తోంది. కరోనాతో ఎవరైనా చనిపోతే, అంత్యక్రియలు ‘పద్ధతి ప్రకారం’ చేయలేని దుస్థితి. మృతదేహాల్ని అమానవీయంగా పూడ్చిపెడుతున్న, తగలబెడ్తున్న వైనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ‘ఎవడి చావు వాడే చావండి..’ అన్నట్లుగా ప్రజల్ని గాలికొదిలేసినట్లే కన్పిస్తోంది. టెస్టుల సంఖ్య పెరుగుతోంది.. మంచిదే. కానీ, ప్రజలకు భరోసా ఇవ్వడంలేదెందుకు.? కరోనా నుంచి బయటపడ్డవారి ద్వారా ప్రచారం చేయిస్తే.. ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది. కానీ, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపించకపోవడం ఆశ్చర్యకరమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...