Switch to English

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం: అప్పుడు బాబు, ఇప్పుడు జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు గతంలో చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నించింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరులో ఇందు కోసం భూమిని కూడా కేటాయించారు. డిజైన్లు ఖరారయ్యాయి. 125 అడుగుల ఎత్తున వుండే విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నది చంద్రబాబు సర్కార్‌ అప్పట్లో రచించిన ప్లాన్‌.

ఇక, ఇప్పుడు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదాన్‌లో 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జులై 8న ఈ ప్రాజెక్ట్‌కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారు. స్వరాజ్య మైదానం పేరుని కూడా, అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా మార్చనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 125 అడుగుల ఎత్తయిన విగ్రహంతోపాటుగా అంబేద్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రతిబింబించేలా మెమోరియల్‌ హాల్‌, లైబ్రరీ, స్టడీ సెంటర్‌ వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అత్యద్భుతమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెన్‌, ఓపెన్‌ ఎయిర్‌ ది¸యేటర్‌ వంటివి ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలుగా వుంటాయట.

దాదాపుగా వీటన్నిటినీ గతంలో తుళ్ళూరులో డిజైన్‌ చేసిన ప్రాజెక్టులోనూ పొందుపరచాలనుకున్న విషయం విదితమే. అన్నట్టు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆలోచన చేసినా, ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ఏమయ్యిందో ఎవరికీ తెలిసని పరిస్థితి. మరి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తుందోనన్న ప్రశ్న తలెత్తడం సహజమే కదా.! ఇదిలా వుంటే, స్వరాజ్య మైదాన్‌ విషయంలో అనేక రాజకీయ వివాదాలున్నాయి. కొందరు రాజకీయ పెద్దలు ఈ భూమిపై కన్నేశారంటూ నానా యాగీ జరిగింది, జరుగుతూనే వుంది. దీన్నొక కమర్షియల్‌ యాక్టివిటీ సెంటర్‌గా మార్చాలనే ప్రయత్నాలూ జరిగాయి. ఈ నేపథ్యంలో బోల్డన్ని ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇక, ఇప్పుడు అంబేద్కర్‌ మెమరియల్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న దరిమిలా, వివాదాలకు పెద్దగా ఆస్కారం వుండకపోవచ్చు. అయితే, తుళ్ళూరులో ప్లాన్‌ చేసిన అంబేద్కర్‌ మెమోరియల్‌ మాటేమిటి.? అది కాలగర్భంలో కలిసిపోయినట్లేనా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...