Switch to English

మండలి కొనసాగింపునకు వైసీపీ షరతులివీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ నెలకొన్న వైరం శాసనమండలి మనుగడకు ముప్పు తెచ్చిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ బృహత్తర బాధ్యతను వామపక్ష పార్టీలు నెత్తికెత్తుకున్నాయి. అధికార పార్టీకి కావాల్సింది కూడా ఇదే. మండలి అవసరం వారికి కూడా ఉన్న నేపథ్యంలో రద్దు అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం. ఇది పని చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

తమకు చట్టసభల్లో ప్రాతినిధ్య కల్పిస్తున్న మండలిని రద్దు కాకుండా చూసుకునేందుకు వామపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. పీడీఎఫ్ కు చెందిన తొమ్మిది మంది టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మండలిలో ఉన్నారు. వైసీపీ, టీడీపీ వైరం కారణంగా మండలి రద్దైతే వారందరి పదవులూ పోవడం ఖాయం. శాసనసభలో వారికి ప్రాతినిధ్యం లేకపోవడంతో మండలి పదవులు కోల్పోవడం వారికి ఇష్టం లేదు.

ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నడుమ సంధి కుదర్చడానికి పీడీఎఫ్ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా తమను కలిసిన ఆ ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలు తమ షరతులు వివరించారని తెలుస్తోంది. మండలి అవసరం తమకూ ఉందని, కానీ ఇలా చీటికీ మాటికీ రూల్ 71, సెలెక్ట్ కమిటీ అంటూ శాసనసభ ఆమోదించిన బిల్లును ఇకపై టీడీపీ అడ్డుకోకూడదని స్పష్టంచేసినట్టు చెబుతున్నారు.

అలాగే రాజధానిపై బిల్లును సవరణలతో శాసనసభకు పంపించేయాలని, మండలి చైర్మన్ షరీఫ్ చేత రాజీనామా చేయించాలని సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా తమకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై వేటు వేయకుండా చూడాలని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు.

వీటికి తెలుగుదేశం అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీల్లో పలువురు సైతం మండలి రద్దు కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ శాసనమండలి కొనసాగుతుందా లేక కాలగర్భంలో కలిసిపోతుందా అనేది ఈ మూడు రోజుల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...