Switch to English

వారందరికీ ప్రాంతీయ బోర్డుల్లో పునరావాసం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చాలామందికి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని రద్దు చేసే దిశగా ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు ముందుకెళుతోంది. సోమవారం వరకు వేచిచూసి, ఆలోగా పరిణామాలు తమకు అనుకూలంగా మారకపోతే.. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అటు టీడీపీతోపాటు అధికార పార్టీకి కూడా నష్టమే జరగనుంది.

ప్రస్తుతం మండలిలో అధికార పార్టీకి 9 మంది సభ్యులున్నారు. మండలి రద్దైతే వారందరి పదవులు కూడా పోతాయి. పైగా రాబోయే నాలుగేళ్లలో 15 నుంచి 20 మందిని ఎమ్మెల్సీలుగా నియమించే అవకాశం వైసీపీకి వస్తుంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనివారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తానని జగన్ పలువురికి హామీ ఇచ్చారు. మండలి లేకుంటే ఈ హామీ అమలు కాదు. అయినప్పటికీ, జగన్ మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి తెలిసింది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు ప్రాంతీయ అభివృద్ది బోర్డులను ఏర్పాటు చేస్తూ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ఇటీవలే శాసనసభ ఆమోదించింది. సీఎం జగన్ చైర్మన్ గా వ్యవహరించే బోర్డులో వైస్ చైర్మన్ తోపాటు తొమ్మిది మంది సభ్యులను నియమించే అవకాశం ఉంది. వైస్ చైర్మన్ కి కేబినెట్ హోదా కూడా ఇవ్చొచ్చు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా అవకాశం కోల్పోయినవారిని ఆయా బోర్డుల్లో నియమిస్తారని చెబుతున్నారు. ఒక్కో బోర్డులో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగిలిన సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. ఇలా మండలి బదులు ప్రాంతీయ బోర్డుల్లో వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మండలి రద్దుకు సైతం వెనకాడకుండా ముందుకెళ్లాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం.

సాధ్యమైనంత వరకు టీడీపీ ఎమ్మెల్సీలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని, అది కుదరని పక్షంలోనే మండలి రద్దుకు ముందుకెళ్లే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా మూడు రోజులు సమయం ఉండేలా సోమవారం సభలో దీనిపై చర్చించాలని సర్కారు నిర్ణయం తీసుకుందని పేర్కొంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...