Switch to English

ప్రభుత్వ డాక్టర్ల నెత్తిన జగన్‌ బాంబు.. ప్రజలకేంటి లాభం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ప్రభుత్వ డాక్టర్ల నిర్వాకాల గురించి ఎప్పటికప్పుడు చూస్తూనే వున్నాం. ప్రభుత్వాసుపత్రికి ఓ రోగి వెళితే, తాను నడుపుతున్న క్లినిక్‌కి స్వయంగా తానే సిఫార్సు చేసుకుంటున్న డాక్టర్లు చాలామందే వున్నారు. అందరూ అని కాదుగానీ, ప్రభుత్వ డాకర్లలో చాలామంది ఈ తరహా ‘పక్కదారి’ వ్యవహారాలు నడుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యులు, ప్రైవేటు వ్యవహారాలు నడపకూడదంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘నిషేధాన్ని’ తెరపైకి తెచ్చింది.

ప్రభుత్వాసుపత్రుల్లో సరికొత్త మార్పుల దిశగా ఈ చర్యలు చేపట్టినందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించి తీరాల్సిందే. కానీ, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల మాటేమిటి.? ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల్ని కల్పిస్తే, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే అవసరమే వుండదు. ఓ పక్క, ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్ని పెంచి పోషిస్తూ, ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు వ్యవహారాలు చెయ్యకూడదని నిషేధం విధిస్తే.. ముందు ముందు అదో చారిత్రక తప్పిదంగా మారే అవకాశాలూ లేకపోలేదు.

వైద్యులు సమ్మెకి దిగితే, ఆ తర్వాతి పరిణామాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంస్కరణల పేరుతో ఇప్పుడు ప్రజారోగ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రమాదంలో పడేస్తున్నారన్న వాదన తెరపైకొస్తోంది. ప్రైవేటు కార్యకలాపాలకు దూరంగా వున్నంతమాత్రాన, పక్కదారి పట్టేసిన ప్రభుత్వ వైద్యులు.. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సను సామాన్యులకు అందిస్తారని ఎలా అనుకోగలం.? అన్నది విపక్షాల నుంచే కాదు, సామాన్యుల నుంచీ దూసుకొస్తున్న ప్రశ్న.

కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేక, కొందరు ప్రభుత్వ వైద్యులు తాము నడుపుతున్న ఆసుపత్రుల ద్వారానో, తమకు పరిచయం వున్న ఆసుపత్రుల ద్వారానో సామాన్యులకు మెరుగైన వైద్యం అందిస్తున్న దాఖలాలూ లేకపోలేదు. అందర్నీ ఒకే గాటన కట్టేయలేమిక్కడ. ప్రభుత్వ వైద్యుల, ప్రైవేటు వ్యవహారాలపై నిషేధం మంచిదే.. కానీ, అంతకన్నా ముందు.. నిషేధం విధిస్తే వచ్చే పరిణామాలపై ఆరా తీసి, ఎలాంటి సమస్యలకూ తావు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న ఇంగితం కూడా పాలకులకు వుండి తీరాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...