Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను ఇందుకు కారణం. ఇందుకు సంబంధించి నెట్టింట సమంత షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
‘‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి నాకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ధరించడం ఇంకా సంతోషంగా ఉంది. దీనిని ఇంత అందంగా డిజైన్ చేసిన క్రేశా బజాజ్ కు కృతజ్ఞతలు. జీవితంలో అలవాట్లు మార్చుకోవడ, పాత దుస్తులను రీమోడలింగ్ చేయించి ధరించడం నా లైఫ్ స్టయిల్స్ లో ఒకటి. మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.
2017లో నాగ చైతన్య-సమంత గోవాలో హిందూ, క్రిస్టియన్ పద్దతుల్లో పెళ్లి చేసుకున్నారు.. వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన పెళ్లి వేడుకలో ధరించిన తెల్ల గౌనునే నలుపు రంగులోకి మార్చి ధరించారు.