సందీప్ రెడ్డి వంగా నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ యానిమల్. రన్బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ ట్రైలర్ విడుదలయ్యాక అందులోని ప్రధానంగా హైలైట్ అయిన సీక్వెన్స్ మెషిన్ గన్ ది.
ఈ మధ్య కాలంలో భారీ మెషిన్ గన్ సీక్వెన్స్ లు ఎక్కువవుతున్నాయి. ఖైదీతో మొదలైన ఈ ట్రెండ్, కెజిఎఫ్ 2, విక్రమ్, మార్క్ ఆంటోనీ, రీసెంట్ గా భగవంత్ కేసరి లోనూ వాడారు. ఇప్పుడు యానిమల్ ట్రైలర్ లోనూ ఈ తరహా సీన్ ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మెషిన్ గన్ సీన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ మెషిన్ గన్ ను ఆర్ట్ డైరెక్టర్ చేత ప్రత్యేకంగా చేయించుకున్నాడట దర్శకుడు. దీనికోసం ఏకంగా 50 లక్షలు ఖర్చయినట్లు సమాచారం.