Switch to English

నాని విడుదల చేసిన ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు మేకర్స్.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం జరిగిన రిలీజ్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రచయిత బి.వి.ఎస్.రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “చార్లీ సినిమా సమయంలో రక్షిత్ గారిని కలిశాను. వారికి సినిమానే జీవితం. అందుకే వారు ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడూ మంచి సినిమాలు తీయాలనే వీరి తపన అభినందించదగ్గది. ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా కలిగిస్తోంది” అన్నారు.

రచయిత బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఫోన్ చేసి ఇది అద్భుతమైన సినిమా, అర్జెంట్ గా చూడమన్నారు. నేను సినిమాకి సంబంధించిన వివరాలు అడుగుతుంటే కనీసం ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళమని చెప్పారు. దాంతో ఈ సినిమాని నేను కన్నడ వెర్షన్ లో చూశాను. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. అసలు ఇది ప్రేమ కథ అనాలా, జీవిత కథ అనాలా.. చెప్పడానికి మాటలు వెతుక్కోవాలి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా గురించే ఆలోచించేలా చేస్తూ ఇంటికి తీసుకెళ్ళిపోయే గొప్ప సినిమా ఇది. కన్నీళ్లు మానవత్వానికి సాక్ష్యమైతే.. కన్నీటి సంద్రం ఈ సినిమా. ఇది అంత లోతైన సినిమా. ప్రేమ మనిషి చేత ఎంత తప్పయినా చేయిస్తుంది, ఎంత సాహసమైనా చేయనిస్తుంది. ఆ ప్రేమ ఎంత గొప్ప గొప్పదంటే.. సప్త సముద్రాలు అంత ఉండటమే కాదు, దాని ఆవల కూడా ఉందని చెప్పిన సినిమా ఇది. ఒక్క రిస్క్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అయ్యయో ఎంతో వివరంగా చూపించారు. ప్రతి షాట్ లోనూ కథ చెప్పారు. ఒక్క షాట్ మిస్ అయితే కథ ఏమైనా మిస్ అవుతాం అనిపించేలా ఉంది. సినిమా చివరిలో రెండో భాగం ఉందని గ్లింప్స్ చూపించారు. ఆ గ్లింప్స్ లో ఇంకా పెద్ద జీవితం ఉంది. 22 ఏళ్ల కుర్రాడికి 33 ఏళ్ల దాకా జీవితం చెప్పి.. 33 ఏళ్ల నుంచి మళ్ళీ ఎంత దాకా జీవితం అనుభవించాడు. జీవితంలో ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందని చెప్పడం మామూలు విషయం కాదు. రక్షిత్ శెట్టి ఇంత గొప్ప రచయిత కాకపోతే, ఈ కథని ఇంత గొప్పగా అర్థం చేసుకునేవారు కాదు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ గారు మనకి జీవితాంతం గుర్తుండే పాత్ర పోషించారు. దర్శకుడు హేమంత్ గారు సినిమాని ఎంతో పొయెటిక్ గా తీశారు. ప్రతి ఫ్రేమ్ లో దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ఈ సినిమా చూడటం అనేది మనకో మధురానుభూతి” అన్నారు.

కథానాయకుడు రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “సప్త సాగర దాచే ఎల్లో మొదట కన్నడలో విడుదల చేశాం. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా విడుదల ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతున్నారు. కొన్ని సినిమాలను మనం తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటంతట అవే పయనిస్తాయి. ఈ సినిమాని మేం ఎంతగానో నమ్మాం. చార్లీ సినిమా కర్ణాటక తర్వాత తెలుగులోనే బాగా ఆడింది. అందుకే నేను ఈ ప్రాంతాన్ని సినిమా భూమిగా భావిస్తాను. ఇక్కడ సినిమాని ఒక సంస్కృతిగా చూస్తారు. నాక్కూడా సినిమానే జీవితం, సినిమానే దేవుడు. చార్లీ సినిమాని ఆదరించి, ఇక్కడ సప్త సాగర దాచే ఎల్లో విడుదలకు బాటలు వేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దర్శకుడు హేమంత్ కి ఇది మూడో సినిమా. మూడు సినిమాలు కూడా కన్నడలో మంచి విజయం సాధించాయి. ఇది అతని పూర్తి స్థాయి దర్శకత్వ ప్రతిభను తెలిపే చిత్రం. హీరోయిన్ రుక్మిణీ వసంత్ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

కథానాయిక రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 1న కన్నడ వెర్షన్ హైదరాబాద్ లో కూడా విడుదల కాగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తుండటం సంతోషం కలిగిస్తోంది. మా మను-ప్రియ ల కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు హేమంత్ ఎం రావు మాట్లాడుతూ.. “ఈ సినిమా సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో మా సినిమా విడుదలవుతుండటం గర్వంగా ఉంది. ఈ ప్రాంతాన్ని సినిమా భుమిగా అభివర్ణిస్తారు. హైదరాబాద్ లో కన్నడ వెర్షన్ కొన్ని షోలు ప్రదర్శించగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా తెలుగులో విడుదల అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా కన్నడలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించడుతోంది. చార్లీ సినిమాని తెలుగులో రానా గారు విడుదల చేయగా మంచి విజయం సాధించింది. రక్షిత్ గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని, ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని ఇక్కడ విడుదల చేయాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే టీజర్ ను విడుదల చేశామో, సోషల్ మీడియాలో వచ్చిన అనూహ్య స్పందన చూసి, ఇక్కడ కూడా ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారని అర్థమైంది. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.

3 COMMENTS

  1. Remarkable! Its really awesome article, I have got much clear idea about from this
    paragraph.
    [url=https://%E0%B8%81%E0%B8%B2%E0%B8%A3%E0%B9%80%E0%B8%81%E0%B8%A9%E0%B8%95%E0%B8%A3%E0%B8%AA%E0%B8%A1%E0%B8%B1%E0%B8%A2%E0%B9%83%E0%B8%AB%E0%B8%A1%E0%B9%88.com]การเกษตรสมัยใหม่[/url]

    เทคโนโลยีทางการเกษตรสมัยใหม่

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...