ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడుడుతున్న సమయంలో చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? అంటూ గురువారం శాసనసభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. వాటిపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. ‘‘కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? అని జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి ‘సాక్షి’లో వచ్చిన వార్త. అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు’’ అంటూ సెటైర్ వేశారు. ఈ ట్వీట్లకు జతగా సాక్షి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ క్లిప్లింగులను జతచేశారు.
అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు. pic.twitter.com/nv1e9DtRx4
— Lokesh Nara (@naralokesh) July 11, 2019
అలాగే సున్నా వడ్డీ రుణాల అంశంపైనా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ తమపై బురద జల్లి పారిపోయారని విమర్శించారు. ‘‘బురద జల్లి, నిరూపించు అనేసరికి సభ నుంచి పారిపోయే ఆకతాయి చేష్టలు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చేశారంటే ఉడుకుమోతుతనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ కంత్రీ పనులేంటి జగన్ గారూ! ఈ జన్మలో మీరు హుందాగా ప్రవర్తించలేరా? నిరూపించలేనప్పుడు సవాళ్ళు చేయడం దేనికి’’ అని ప్రశ్నించారు.
వడ్డీలేని రుణాలు ఇవ్వలేదన్న మీ ఆరోపణలు అబద్దం అనడానికి రుజువులు ప్రజల ముందుంచాం. మీ ఛాలెంజ్ ప్రకారం రాజీనామా చేస్తారా? ప్రతిపక్షానికి అడ్డంగా దొరికిపోయి అసెంబ్లీ నుంచి పారిపోయిన మొదటి ముఖ్యమంత్రిగారికి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాం. మీ తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పండి.
— Lokesh Nara (@naralokesh) July 11, 2019
‘‘వడ్డీలేని రుణాలు ఇవ్వలేదన్న మీ ఆరోపణలు అబద్దం అనడానికి రుజువులు ప్రజల ముందుంచాం. మీ ఛాలెంజ్ ప్రకారం రాజీనామా చేస్తారా? ప్రతిపక్షానికి అడ్డంగా దొరికిపోయి అసెంబ్లీ నుంచి పారిపోయిన మొదటి ముఖ్యమంత్రిగారికి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాం. మీ తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పండి’’ అని లోకేశ్ మరో ట్వీట్ చేశారు.
అలాగే తిత్లీ తుఫాను తర్వాత జగన్ అనుసరించిన వైఖరిని కూడా లోకేశ్ తూర్పారబట్టారు. ‘‘తుఫాను అనగానే అట్నుంచటే హైదరాబాదుకు చెక్కేసిన మీరు, ఆ తర్వాత తీరిగ్గా వెళ్ళి, అధికారంలోకి రాగానే తిత్లీ తుఫాను నష్టం రూ.3,435 కోట్లను బాధితులకు నేరుగా ఇస్తానని సిక్కోలు ప్రజలకు చెప్పారు. ఇచ్చిన మాట గుర్తుందా? లేక ఏదైనా గాలికి కొట్టుకుపోయిందా? అని జనం అడుగుతున్నారు జగన్ గారూ’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
తుఫాను అనగానే అట్నుంచటే హైదరాబాదుకు చెక్కేసిన మీరు, ఆ తర్వాత తీరిగ్గా వెళ్ళి, అధికారంలోకి రాగానే తిత్లీ తుఫాను నష్టం రూ.3,435 కోట్లను బాధితులకు నేరుగా ఇస్తానని సిక్కోలు ప్రజలకు చెప్పారు. ఇచ్చిన మాట గుర్తుందా? లేక ఏదైనా గాలికి కొట్టుకుపోయిందా? అని జనం అడుగుతున్నారు @ysjagan గారూ pic.twitter.com/mg6YJwyMQA
— Lokesh Nara (@naralokesh) July 11, 2019
950091 877753Hmm, I never thought about it that way. I do see your point but I think a lot of will disagree 887453
115491 789142Thanks for all your efforts that you have put in this. quite fascinating info . 701347
993053 33757You produced some decent points there. I looked on the internet for that issue and discovered a lot of people is going together with with the internet web site. 454028