ఈరోజు ఉదయమే సీనియర్ నటి జమున గారి మరణవార్త అందరినీ కలచివేసింది. ఆ బాధ సరిపోదు అన్నట్లుగా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏ శ్రీనివాస మూర్తి ఇకలేరు అన్న వార్త అందరికీ షాక్ కు గురి చేసింది. ఈరోజు చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. తెలుగులో వెయ్యికి పైగా సినిమాల్లోని పాత్రలకు తన గొంతునిచ్చారు శ్రీనివాస మూర్తి.
అజిత్, మోహన్ లాల్, విక్రమ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, సూర్య తదితర నటులకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస మూర్తి. మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఆయన ఆఖరు చిత్రాల్లో ప్రముఖమైనది.
ఇతర ఇండస్ట్రీ హీరోలతో పాటు తెలుగురాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా తన గొంతుని అరువిచ్చారు శ్రీనివాస మూర్తి. ఒకే చిత్రంలో రెండు, మూడు పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పిన సినిమాలు ఉన్నాయి. ఆయన మృతి డబ్బింగ్ ఇండస్ట్రీకి తీరని లోటు.
876493 794616Excellent artical, I unfortunately had some problems printing this artcle out, The print formating looks slightly screwed over, something you may want to look into. 298197