Switch to English

గాడ్‌ ఫాదర్ రివ్యూ : ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్ డ్రామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఇష్టపడి మలయాళ సూపర్ హిట్‌ మూవీ లూసీఫర్ ని గాడ్‌ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి లో కూడా ఆసక్తి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

నిజాయితీ గత సీఎం పీకేఆర్‌. ఆయన కూతురు సత్య ప్రియ(నయనతార) అల్లుడు జయదేవ్‌ (సత్యదేవ్‌). సీఎం పీకేఆర్‌ మరణంతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి సినిమా కథ సాగుతుంది. పీకేఆర్ అల్లుడు జయదేవ్‌ సీఎం పీఠంపై కన్నేస్తాడు. డ్రగ్స్ బిజినెస్ చేసే జయదేవ్‌ ని సీఎం పీఠంపై కూర్చోనివ్వద్దని పీకేఆర్ తనయుడు బ్రహ్మా(చిరంజీవి) నిర్ణయించుకుంటాడు. అందుకు బ్రహ్మ చేసిన పని ఏంటీ? ఇంతకు సీఎం పీకేఆర్‌, బ్రహ్మ మధ్య ఉన్న సంబంధం విషయంలో ఉన్న వివాదం ఏంటీ? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

బ్రహ్మ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. కింగ్ మేకర్ పాత్ర ను చిరంజీవి అద్భుతంగా పోషించి మెప్పించాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మెగా స్టార్‌ ను ఈ సినిమాలో కాస్త ఏజ్‌ ఎక్కువ అయిన వ్యక్తి పాత్రలో చూడటం అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమాలో మాస్ సాంగ్స్ లేకున్నా కూడా తన ఇమేజ్ తో చిరంజీవి సినిమాను పూర్తిగా తన భుజాలపై వేసుకుని మోశాడనే చెప్పాలి.

జయదేవ్‌ పాత్ర సత్యదేవ్‌ రక్తికట్టించాడు. ఇప్పటి వరకు హీరోగా మాత్రమే చేసిన సత్యదేవ్‌ మొదటి సారి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అవ్వడంతో ఎలా చేసి ఉంటాడా అంటూ అంతా ఆసక్తి కనబర్చాడు. అంతా ఆశించినట్లుగానే ఈ సినిమాలో ఆయన నటన చాలా బాగుంది. ఆకట్టుకునే బాడీలాంగ్వేజ్ తో ఆయన మెప్పించాడు. ఇక నయనతార సీరియస్ పాత్రలో నటించి మెప్పించింది. లేడీ సూపర్‌ స్టార్ స్థాయికి తగ్గ పాత్ర అనడంలో సందేహం లేదు. ఇతర పాత్రలో నటించిన వారు మెప్పించారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు మోషన్ రాజా స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రీమేక్‌ అయినా కూడా సాధ్యం అయినంత వరకు కొత్తగా ఉండేలా ప్రయత్నించాడు. ఒరిజినల్ స్టోరీ లైన్ మిస్ అవ్వకుండా ఆ ఫ్లేవర్‌ మిస్ అవ్వకుండానే చిరంజీవి కి తగ్గట్లుగా గాడ్‌ ఫాదర్‌ ని చేయడం జరిగింది. చిరంజీవి పాత్రను అద్భుతంగా రాసిన రాచయితలు గ్రేట్‌. సంగీతం కు పెద్దగా స్కోప్ లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ థమన్‌ అన్నట్లుగానే బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తమన్‌ ఒక మంచి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఇక ఈ సినిమా ఎడిటింగ్‌ విషయంలో చిన్న చిన్న విషయాలు తప్ప అంతా బాగానే ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్ :

  • చిరంజీవి నటన,
  • సహ నటీ నటుల నటన,
  • సల్మాన్‌, చిరు సన్నివేశాలు
  • బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌
  • సెకండ్‌ హాఫ్‌

నెగటివ్ పాయింట్స్ :

  • వీఎఫ్‌ఎక్స్ వర్క్‌,
  • ఫస్ట్‌ హాఫ్‌ లో సాగతీత సన్నివేశాలు.

చివరిగా :

మాస్‌ పొలిటికల్‌ డ్రామాగా గాడ్‌ ఫాదర్‌ సాగింది. చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్‌ చిరంజీవి నుండి ఏదైతే ఆశిస్తున్నారో అదే ఈ సినిమా ద్వారా దక్కుతుంది అనడంలో సందేహం లేదు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కాలమే సమాధానం చెప్పాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్‌ : 3.25/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...