రాయలసీమ నుంచి ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా సీమ అభవృద్ధి మాత్రం కానరాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కడపలో బీజేపీ నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సీమ అభివృద్ధికి సీఎం జగన్ చేపట్టి కార్యక్రమాలేంటి..? అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఎన్నాళ్లిలా అప్పులు చేస్తారు..? రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిపై అనుమానం వస్తోంది’.
‘ప్రధాని మోదీ హయాంలో సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాయలసీమ అభివృద్ధికి మొదటగా పోరాడింది బీజేపీనే. పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తోంది. కడప, తిరుపతి, అనంతపురంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. సీమలో రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.’
‘రాష్ట్రంలో కుటుంబ పార్టీలు పోవాలి. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారు. బీజేపీలో చేరినా కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నియంతలు పతనం కాక తప్పదు. వైసీపీని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు సునీల్ దేవధర్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, పురంధేశ్వరి, జనసేన నేతలు పాల్గొన్నారు.
835396 379345This internet site is my breathing in, really excellent layout and perfect content . 108312
140182 932966i was just browsing along and came upon your internet site. just wantd to say fantastic job and this post genuinely helped me. 44682