Switch to English

జగన్‌ హయాంలో సర్కారీ స్కూళ్ళు హుళక్కే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అమ్మ ఒడి పేరుతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. జనవరి 26 (అంటే, 2020 ) నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోందిట. విద్యను వ్యాపారంగా మార్చడాన్ని తమ ప్రభుత్వం అస్సలేమాత్రం సహించదంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెబుతున్నా, అమ్మ ఒడి పథకం లక్ష్యమేంటో మాత్రం స్పష్టంగా కన్పిస్తూనే వుంది. స్కూలుకు తన బిడ్డను పంపించే ప్రతి తల్లికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏడాదికి 15 వేల రూపాయల్ని అందిస్తుందన్నది ఈ పథకంలోని ముఖ్యమైన అంశం. ఆ 15 వేలు కేవలం ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల కోసం మాత్రమేనన్నది నిర్వివాదాంశం. అంటే, సర్కారీ స్కూళ్ళకు ఎవరూ వెళ్ళొద్దు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మీ పిల్లల్ని ఎంచక్కా ప్రైవేటు స్కూళ్ళకు పంపించండనే కదా అర్థం.!

ప్రభుత్వం తరఫున ఇంత బాహాటంగా ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రోత్సహిస్తోంటే, భవిష్యత్తులో సర్కారీ స్కూల్‌ అనేది కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వైఎస్‌ హయాంలో తెరపైకి వచ్చిన ఆరోగ్య శ్రీ కూడా అప్పట్లో ఇలాంటి విమర్శలే ఎదుర్కొంది. వైద్య – ఆరోగ్య శాఖలో సంచలన మార్పులు తీసుకొచ్చి, వైద్యాన్ని సామాన్యుడికి చేరువ చేయాలనీ, సర్కారీ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలనీ అంతా కోరుకుంటోన్న తరుణంలో, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సర్కారీ ఆసుపత్రుల్ని సామాన్యులకి దూరం చేసేశారు.

ఆరోగ్యశ్రీ కారణంగా, ప్రైవేటు హాస్పిటల్స్‌ కార్పొరేట్‌ మాఫియా స్థాయికి చేరిపోయాయన్న విమర్శలు ఈనాటికీ విన్పిస్తున్నాయి. స్టార్‌ హోటళ్ళను తలపించేలా ప్రైవేటు ఆసుపత్రులు ఎదిగాయంటే, దానికి కారణం ఆరోగ్యశ్రీనే. కడుపు నొప్పి వస్తే చాలు, ఆరోగ్యశ్రీ కింద, సర్జరీ చేసేసి.. వేలు, లక్షలు దండుకుంటున్నాయి కార్పొరేట్‌ ఆసుపత్రులు. అయితే, ఆరోగ్యశ్రీ వల్ల కొంత మేలు జరిగిన మాట కూడా వాస్తవం.

కానీ, ప్రైవేటు విద్యా సంస్థల వల్ల సాధారణ ప్రజానీకానికి మేలు జరగకపోగా, కీడు జరిగే అవకాశమే ఎక్కువ. పేద పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో చదివించి, దానికోసం తల్లులకు 15 వేల రూపాయలు ఏడాదికి ఇచ్చేబదులు, ఆ మొత్తంతో సర్కారీ స్కూళ్ళను సౌకర్యాల పరంగా కార్పొరేట్‌ స్కూళ్ళ స్థాయికి తీసుకురాగలిగితే, పైసా ఖర్చు లేకుండా విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా.? కానీ, ప్రజల డబ్బుతో ఆ ప్రజల ఓట్లను కొనేయడాన్ని అలవాటు చేసుకున్న రాజకీయం ఇంతకన్నా గొప్పగా ఎలా ఆలోచిస్తుంది.?

Related posts

జగన్‌కి స్వామీజీ ఆశీస్సులు.. సింగర్‌ చీవాట్లు

జగన్ దూకుడుతో కేసీఆర్ కు ఇబ్బందులు

జగన్‌ ‘రెండున్నర’ ఫార్ములా.. నవ్వుల పాలవుతున్న వేళ

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...