Switch to English

స్మశానం కాదు.. ఎడారి కాదు.. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఎవరు ఎన్ని కుప్పిగంతులు వేసినాసరే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. ఇది ఇంకోసారి నిరూపితమయ్యింది. సరే, అమరావతిలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందా.? పచ్చ చొక్కాలు భూముల్ని బొక్కేశాయా.? అన్నది వేరే చర్చ. నిజానికి, అదే జరిగి వుంటే.. ఆ పచ్చ చొక్కాలన్నీ ఇప్పుడు జైల్లో వుండేవేనేమో. కానీ, అలా జరగలేదంటే.. ఒకటీ అమరావతిలో అక్రమాలు జరగలేదని అర్థం. లేదూ, ఆ పచ్చ చొక్కాలతో ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీ కుమ్మక్కయ్యిందని అర్థం.

అమరావతి అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ కాదు.. చంద్రబాబు వర్సెస్ జగన్ అసలే కాదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. అది అమరావతి కావొచ్చు, మరో నగరం కావొచ్చు.. రాజధానిగా ముద్ర పడ్డాక ఆ నగరం లేదా ఆ ప్రాంతం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. కానీ, ఆ సోయ ప్రభుత్వ పెద్దలకు లేకుండా పోయింది.

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది కాబట్టి, ఆ అమరావతిని దెబ్బ తీయాలనే కుట్ర నడిచింది. అందులో భాగంగా అమరావతిని ఎడారి అన్నారు.. స్మశానమన్నారు.. ముంపు ప్రాంతమన్నారు. కానీ, అమరావతి రాజధానిగా ప్రకటితమయ్యాక.. రాష్ట్రంలో పలు సందర్భాల్లో భారీ వర్షాలు కురిసి, నదులు ఉప్పొంగి పలు ప్రాంతాలు మునిగాయే తప్ప, అమరావతి మునగలేదు.

మూడు రాజధానులన్నారు.. దాదాపు రెండేళ్ళు నడిచింది ఆ నాటకం. చివరికి ఏమయ్యింది.? మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాల్సిందే. ముందంటూ ఓ రాజధానిని అభివృద్ధి చేసుకున్నాక, ఆ తర్వాత పది కాదు, పాతిక రాజధానుల్ని కడితే ఎవరైనా వద్దంటారా.? ఛాన్సే లేదు.

లక్ష కోట్లు ఖర్చు చేయలేం.. అంటూ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పడం శోచనీయం. లక్ష కోట్లు అవసరం లేదు. ఓ పది వేల కోట్లు వెచ్చించి.. చిన్న రాజధానిగా అయినా అమరావతిని అభివృద్ధి చేసి వుంటే బావుండేది కదా.? పోనీ, ఓ ఐదు వేల కోట్లు ఖర్చు చేశారా గడచిన రెండేళ్ళలో.. లేదే.!

అమరావతి ప్రాంతం మీద తనకు బోల్డంత ప్రేమ, అభిమానమని జగన్ చెప్పుకున్నారు. ఏదీ, ఎక్కడ.? అమరావతిని స్మశానంగా, ఎడారిగా మంత్రులు అభివర్ణిస్తున్నప్పుడు వారించలేదే. వారిని వారించి వున్నా అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ, అభిమానం వున్నాయని అనుకోవచ్చు.

మరింత సమగ్రమైన రీతిలో బిల్లుని తీసుకొస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఏమో, అదెలా వుంటుందోగానీ, ముందైతే ఏకైక రాజధాని అమరావతి మీద ఫోకస్ పెట్టాలి. రాష్ట్రానికి రాజధాని అవసరం.. అదీ అత్యంత వేగంగా. లేదంటే, రాష్ట్రం ఇప్పటికే పాతికేళ్ళు వెనకబడింది.. ఇంకో యాభైయ్యేళ్ళు వెనకబడిపోతుంది అభివృద్ధిలో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...