వైద్య రంగంలో అద్భుతాలకు కొదవేమీ లేదు. ఇప్పుడంటే పిల్లలకు జన్మనివ్వడాన్ని కొందరు చాలా కష్టమైన పనిగా భావిస్తూ,, సరోగసీ ద్వారా ‘అమ్మ’ అనిపించేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుగానీ, ఒకప్పటి పరిస్థితులు వేరు. మాతృత్వంలోని ఆ అనుభూతిని పదే పదే చవిచూసేందుకు పదే పదే ఆరాటపడేవారు. పెద్ద పెద్ద కుటుంబాలు అప్పట్లో అలానే రూపొందేవి.
ఇప్పుడు ట్రెండ్ బాగా మారిపోయింది. మరోపక్క, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గర్భం దాల్చడం అనేది కష్ట సాధ్యంగా మారిపోయింది. ఇదిలా వుంటే, 73 ఏళ్ళ వయసులో ఓ బామ్మ తల్లి అవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ వృద్ధ జంట, ఏడు పదుల వయసులో ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులవడం గమనార్హం. వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. దీన్నొక ప్రపంచ రికార్డుగా వైద్యులు చెబుతున్నారు.
ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చిన 73 ఏళ్ళ వృద్ధురాలికి సిజేరియన్ చేశారు వైద్యులు. ఈ క్రమంలో ఆమెకు ఇద్దరు కవలలు జన్మించారు. గర్భం దాల్చినప్పటినుంచీ ఆ వృద్ధురాలిని గుంటూరులోని ఓ ఆసుపత్రిలో వుంచి వైద్య చికిత్స అందిస్తూ వచ్చారు. తొమ్మిది నెలల్లో ఎక్కడా ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదని ఆమెకు వైద్య చికిత్స అందించిన వైద్యురాలు వెల్లడించారు.
అత్యంత పకడ్బందీగా సిజేరియన్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం నిపుణులతో కూడిన వైద్య బృందం పనిచేసింది. కవలలు జన్మించనున్నారన్న విషయం ముందే తెలుసుకున్న వృద్ధ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పెళ్ళయి తమకు యాభై ఏడేళ్ళయ్యిందని.. ఇన్నేళ్ళలో పిల్లల కోసం తాము చేయని ప్రయత్నం లేదని వృద్ధ దంపతులు చెప్పారు. ప్రస్తుతం వృద్ధురాలు సిజేరియన్ అనంతరం వైద్య పర్యవేక్షణలో వున్నారు.
823503 419915of course data entry services are quite expensive that is why always make a backup of your files 466187
406846 506557I believe other site owners ought to take this site as an example , quite clean and fantastic user genial style . 355015