Switch to English

381 ఈవీఎంలలోనే సమస్యలు: ద్వివేది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎంలపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టంచేశారు. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వెళ్తుందడనం పూర్తిగా అవాస్తమన్నారు. పోలింగ్ సందర్భంగా అమరావతిలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవీఎంలపై వస్తున్న అపోహల గురించి వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే, వైఎస్సార్ సీపీకి పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే.

వీటిని మీడియా ప్రతినిధులు ద్వివేది వద్ద ప్రస్తావించగా.. ఆయన వాటిని తోసిపుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 381 ఈవీఎంలలో మాత్రమే సమస్యలు వచ్చాయని, వాటిని తమ ఇంజనీర్లు సరిచేశారని తెలిపారు. కనెక్షన్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల మాత్రమే సమస్యలు తలెత్తాయన్నారు. అస్సలు ఈవీఎంలు పనిచేయని సంఘటనలు కేవలం 30లోపే ఉంటాయని, అలాంటిచోట్ల కొత్త యూనిట్లు పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ఇక ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి ఓటు పడుతోందనడం సరికాదన్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, అంతా సక్రమంగా ఉందని వారు భావించిన తర్వాతే పోలింగ్ మొదలుపెట్టామని స్పష్టంచేశారు. అందువల్ల అలాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉండదన్నారు. మాక్ పోలింగ్ లో సక్రమంగా ఉన్న ఈవీఎంలు తర్వాత ఎలా మారిపోతాయని ప్రశ్నించారు. ఒకవేళ ఎక్కడైనా అలా జరిగితే, అక్కడి అధికారులు టెస్ట్ ఓట్ వేసి, దాన్ని నిర్ధారించుకునే అవకాశం కూడా ఉందన్నారు.

అందువల్ల ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. అక్కడక్కడా ఈవీఎంలు పనిచేయకపోవడం నిజమే అయినా, అది చాలా తక్కువేనన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారు ఎంత మంది ఉన్నప్పటికీ వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ద్వివేది స్పష్టంచేశారు. సాయంత్రం 6 గంటలకు లైన్లో ఉన్నవారి కోసం రాత్రి ఎంత సేపటి వరకైనా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అయితే, ఓటు వేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గంటల కంటే ముందుగానే లైన్లో ఉండాలని స్పష్టంచేశారు. ఈవీఎంల పనితీరుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...