కారుతో సహా ఏ వాహనంపైనైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలకు ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ అనే లాయర్ తన కారులో ఒంటరిగా వెళ్తూ మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ఓ పోలీసు కారును ఆపి 500 జరిమానా విధించాడు. దీనిని నిరసిస్తూ సౌరభ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. కారుతో సహా ఏ వాహనంపైనైనా ఒంటరిగా వెళ్తున్నా మాస్క్ ఖచ్చితంగ పెట్టుకుని తీరాలని తీర్పునిచ్చింది.
‘కారులో వెళ్తున్నా పబ్లిక్ లోకే కదా..! అయినా మీ ఆరోగ్యం కోసమే.. తోటి సమాజం కోసమే కదా మాస్క్ పెట్టుకోవాలని చెప్పేది. మాస్క్ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? కరోనా వేవ్ తీవ్రంగా ఉంది. కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ ధరించాల్సిందే’నంటూ న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పు వెల్లడించారు.
276582 670332I enjoy reading article. Hope i can locate far more articles like this 1. Thanks for posting. 906266
940608 53169Really fighter messages are supposed to amuse offer praise into the groom and bride. 1st time audio system watching more than the top places really should also remember you see, the senior guideline of the speaking, which is your specific person. greatest man speeches brother 931086
740332 434759You got a really very good web site, Gladiola I discovered it by means of yahoo. 901629