కరోనా కల్లోలం ధాటికి ప్రపంచమే కుదేలైపోయింది. పెద్ద పెద్ద దేశాల ఆర్ధిక వ్యవస్థలే దెబ్బ తిన్నాయి. దేశాల్లో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఉపాధి కోల్పోయి కోట్లాదిమంది ప్రజలు ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడీ దెబ్బ క్రికెట్ నూ తాకింది. వైరస్ ప్రభావానికి సిరీస్ లే రద్దయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక దేశ క్రికెట్ బోర్టే ప్రక్షాళణ స్థితికి వచ్చేసింది. ఉద్యోగులు, ఖర్చులను తగ్గించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఆ దేశమే ‘ఇంగ్లాండ్’.
క్రికెట్ పుట్టిన దేశమైన ఇంగ్లండ్ లో ఇందుకు సిద్ధమవడం ఆశ్చర్యపరిచేదే. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లో ఏకంగా 62 మందిపై వేటేసేందుకు రంగం సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకునేందుకు జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్మాణం, బడ్జెట్ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ అంటున్నారు. పెరిగిన ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదని అన్నారు. ఇందుకు బోర్డు ఆమోదించిందని.. ఈ చర్యల వల్ల ఈసీబీలోని అన్ని విభాగాలపైనా ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
ఈసీబీ భవిష్యత్తు, ఇంగ్లంగ్ క్రికెట్ ను కాపాడాలంటే ఈ ప్రక్షాళనలు తప్పవని టామ్ అంటున్నారు. వర్క్ఫోర్స్ బడ్జెట్ నుంచి 20 శాతం తగ్గించాలన్న ప్రతిపాదన వచ్చిందన్నారు. దీనికి 62 మందిని తగ్గించుకోవడమే పరిష్కారమన్నారు. ప్రస్తుతం ఉన్న పోస్టులు.. పని విధానాలు.. మారుస్తామన్నారు. ఈ విషయాలన్నింటినీ ఈసీబీ సిబ్బందికి తెలియజేసామన్నారు.
349417 457738Certainly,Chilly location! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 499630