Switch to English

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.! దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో ఓ సినిమా వచ్చింది కొన్నాళ్ళ క్రితం. నితిన్ హీరో.! సినిమా కదా, కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, మాచర్ల నియోజకవర్గంలో జరిగే రాజకీయ హింస మాత్రం నిజం. అది ఇంకోసారి నిరూపితమయ్యింది.

తాజా ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి, తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో సృష్టించిన గలాటా అంతా ఇంతా కాదు. ఏకంగా, నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా, ఓ ఈవీఎంని పగలగొట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇంత జరుగుతున్నా, ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్లు.? అంతకన్నా ముందు పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్లు.?

ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో కలిసి వెళ్ళి, నానా బీభత్సం సృష్టించారు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి. అయితే, పోలింగ్ జరిగిన వారం రోజులకు, ఆ విషయం వెలుగు చూసింది. పిన్నెల్లి ఈవీఎం‌ని పగలగొట్టిన విషయం ఇప్పటిదాకా బయటకు రాలేదంటే, వ్యవస్థలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎంని పగలగొట్టినట్లుగా తొలుత కేసు నమోదయ్యిందట. ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ బయటపడిందో, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విఝయాన్ని సీరియస్‌గా తీసుకుందట. నవ్విపోదురుగాక మనకేటి..? అన్నట్లు తయారైంది వ్యవహారం.

రాయలసీమ ఫ్యాక్షన్‌ని మించి, పల్నాడులో రాజకీయ హింసని చూస్తుంటాం. ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో హింస చోటు చేసుకుంది. తలలు పగిలాయ్, ప్రాణాలు కూడా పోయాయ్.. కానీ, పోయిన ప్రాణాలకు లెక్క లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే, కేసులు పెట్టడానికి కూడా ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదక్కడ.

అయినా, ఓ ప్రజా ప్రతినిధి స్వహస్తాలతో ఈవీఎంని పగలగొట్టడమేంటి.? ఎంత కండకావరం.? పైగా, ఈ దాడిని వైసీపీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. సదరు పోలింగ్ బూత్ నుంచి వైసీపీ ఏజెంటుని టీడీపీ ఏజెంట్లు తరిమికొట్టారనీ, ఈ క్రమంలోనే నిరసనగా ఎమ్మెల్యే, ఈవీఎంని పగలగొట్టారనీ చెప్పుకుంటున్నారు వైసీపీ మద్దతుదారులు.

ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? జరిగిన నేరాన్ని సైతం సమర్థించే స్థాయికి వైసీపీ, కొంతమంది సైకోల్ని కార్యకర్తలుగా, సోషల్ మీడియా వారియర్స్‌గా నియమించినట్లుంది వ్యవహారం. ‘సౌమ్యుడు, మంచివాడు..’ ఇదీ వైఎస్ జగన్, తమ పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా పరిచయం చేసిన తీరు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత సౌమ్యుడంటే, ఇదిగో ఈవీఎంలను పోలింగు బూతుల్లోకి వెళ్ళి మరీ పగలగొట్టేంత సౌమ్యుడు.!

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

గడచిన ఏడాదిలో వైఎస్ జగన్ ఏం సాధించినట్లు.?

కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్ళు సమయం ఇస్తాం.. కాదు కాదు, ఏడాది సమయం ఇస్తాం.. అని ఓడిన రాజకీయ పార్టీలు, గెలిచిన రాజకీయ పార్టీల గురించి చెబుతుండడం చూస్తుంటాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి,...

అఖండ-2 టీజర్ ఆగయా.. బాలయ్య తాండవం..

బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ రానే వచ్చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది....

‘కన్నప్ప’ మూవీ శివుడి ఆజ్ఞ.. మోహన్ బాబు, విష్ణు ఎమోషనల్..

తాము కన్నప్ప మూవీని తీయడం శివుడి ఆజ్ఞ అని మంచు మోహన్ బాబు, విష్ణు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. మోహన్ బాబు,...

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ ఆదివారం అదే వేదిక మరియు సమయానికి...

అనుకున్న డేట్ కే వస్తున్న తమ్ముడు.. త్వరలోనే ట్రైలర్..

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ల‌య‌, స‌ప్త‌మీ గౌడ‌,...