కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్ లక్ష్మీదేవి భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. ఆమె భర్తకు అతడి అన్నతో కలిపి పురపాలక సంస్థ కార్యాలయం వెనుక 1.29 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకోలేదు. ఇటీవల ఆ భూమిని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరియు ఆయన తనయుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం తమకు తెలియదు అని.. తమ సంతకాలు లేకుండానే రిజిస్ట్రర్ చేయించుకున్నట్లుగా లక్ష్మీదేవ ఆరోపించారు.
ఆ భూమిని పంచుకునేందుకు కోర్టుకు వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. తమ బతుకు దెరువు అయిన ఆ భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దం అయినట్లుగా ఆమె పేర్కొన్నారు. నాకు సీఎం జగన్ న్యాయం చేయాలని.. ఎమ్మెల్యే బలవంతంగా లాక్కున్న భూమిని ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేసింది. లక్ష్మి దేవి కుమార్తె మాట్లాడుతూ నాకు నాన్న లేడు, భర్త తో విడాకులు అయ్యాయి. మా బతకుదెరువు అదే. ఎమ్మెల్యే మా భూమిని లాక్కున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
918733 226571Thanks for helping out, superb info. 308550
812287 704160bathroom towels really should be maintained with a excellent fabric conditioner so that they will last longer:: 185925
949920 223686I enjoy reading write-up. Hope i can uncover far more articles like this 1. Thanks for posting. 127299
211849 859825But a smiling visitor here to share the adore (:, btw excellent pattern . 832680