ముంబయి బాంద్రా ప్రాంతంలోని ఒక ఇంట్లో తల్లి కూతురు కలిసి ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంటి కిటికీ నుండి చెత్త వేయడంతో పాటు మలం కూడా వేస్తుండటం వల్ల చెడు వాసన వస్తుంది అంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా ఇద్దరు మహిళల్లో ఒక మహిళ మృతి చెంది ఉంది. మృతురాలు తల్లిగా స్థానికులు చెబుతున్నారు. 83 ఏళ్ల తల్లి చనిపోవడంతో మతి స్థిమితం సరిగా లేని 53 ఏళ్ల కూతురు బయటకు చెప్పకుండా అలాగే ఇంట్లోనే శవంను పెట్టుకుని ఉంది.
మార్చి లోనే ఆమె చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇన్ని నెలలు తల్లి శరీరంను ఆమె ఎలా కుళ్ల పోకుండా ఉంచింది అనేది తెలియాల్సి ఉంది. మానసికంగా సరిగా లేని కూతురు తల్లి మృతి చెందిన విషయం బయటకు చెప్పకుండా తనంతగా తాను ఉండేది. ఎవరితో మాట్లాడేది కాదు. దాంతో ఎవరు కూడా ఆ ఇంటి గురించి ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కాని పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో మొత్తం విషయం బయట పడింది. వృద్దురాలి మృతదేహంను పోస్ట్మార్టంకు పంపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
406696 356700amazing post. Neer knew this, thanks for letting me know. 356938