అరరె.! కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా గట్టిగా తిట్టేశారే.! మరిప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు.? సింగిల్ సింహం.. తోడేళ్ళ గుంపు.. అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద వైఎస్ జగన్ ఎదురుదాడికి దిగే అవకాశం వుందా.?
జేపీ నడ్డా మీద అడ్డమైన విమర్శలూ చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయబోతున్నారు.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ అంశం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు జనం ముందుకు వస్తున్నారు. ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో, జగనన్న విద్యా కానుక కింద, స్కూల్ యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన.
ఇకనేం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు సరైన వేదిక దొరికినట్లే. కానీ, కేంద్ర హోంమంత్రిని నిలదీసేంత సాహసం వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెయ్యకపోవచ్చు.
ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చిత్రంగా వుంటాయ్. బీజేపీని ప్రశ్నించాలంటే, వైసీపీకి ఎక్కడో భయం. అందునా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, అస్సలేమాత్రం కేంద్రాన్ని ప్రశ్నించరుగాక.. ప్రశ్నించరు.
కేంద్రాన్నిగానీ, ఆ కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీనిగానీ ప్రశ్నించాలంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా భయాలున్నాయ్. సో, వైఎస్ జగన్, బీజేపీని నిలదీస్తారని అనుకోవడానికి లేదన్నమాట.