తోడ బుట్టిన చెల్లి అడుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదా రాజధానులు వున్నాయా.? వుంటే, అవేంటి.? అని.! ప్రత్యేక హోదా ఏమయ్యింది.? కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా ఎందుకు తీసుకురాలేదు.? అని కూడా వైఎస్ షర్మిల ప్రశ్నిస్తోంది.
రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎదురుదాడి చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలవాటే. ఏదన్నా సమస్య గురించి జనసేన అధినేత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు, ముందుగా వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చే మాట, ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ’ గురించే.
మరిప్పుడు, వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతారు.? వైఎస్ షర్మిల పెళ్ళిళ్ళ ప్రస్తావనని వైఎస్ జగన్ తన తదుపరి బహిరంగ సభల్లో ప్రస్తావిస్తారా.? ఆమెను దత్త పుత్రికగా వైఎస్ జగన్ అభివర్ణిస్తారా.?
సరే, ఆయన ఏదో ఒకటి అంటారు.. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని సరిపెట్టుకోవచ్చు. కానీ, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా.? రాష్ట్ర ప్రజల కోసమైనా రాజధాని ఏదన్న ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెప్పి తీరాల్సిందే.! రాష్ట్రంలో రోడ్ల దుస్థితినీ వైఎస్ షర్మిల నిలదీశారు. మరి, వాటికి వైఎస్ జగన్ ఎలాంటి సమాధానం చెబుతారో.!
కాంగ్రెస్ నేతగా.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నిలదీస్తున్నారు.. అదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ‘వైఎస్ షర్మిల నుంచి ఇలాంటి భాషని మేం ఊహించలేదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేసేశారు.
బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తరచూ వాడే భాషలాంటిదేమన్నా, వైఎస్ షర్మిల నోటి నుంచి వైసీపీ మీద ఆశించి వుంటారేమో.! పెద్ద కష్టమే వచ్చిందిప్పుడు వైసీపీకి.! అన్నట్టు, వైఎస్ జగన్ క్రిస్టియన్ అని వైఎస్ షర్మిల సర్టిఫై చేసేశారు. ఈ విఫయమ్మీద సకల శాఖ మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి పెదవి విప్పుతారా.? లేదంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా తన మతం ఏంటన్నదానిపై స్పష్టతనిస్తారా.?