రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం. దురదృష్టవశాత్తూ రాజకీయ పార్టీలు ఆరోపణలకు పరిమితమవుతుంటాయి. అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాట. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తాము అధికారంలోకి వచ్చాక ‘వైఎస్ జగన్ అక్రమాల్ని వెలికి తీస్తాం.. దోచిన సొమ్ముని రాబట్టి ప్రభుత్వ ఖజానాకి చేరుస్తాం..’ అని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ పని చేయగలిగారా.? లేదే.! ఇప్పుడు వైఎస్ జగన్ వంతు.
అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో చెబుతోంది. లక్షల కోట్ల అవినీతి అమరావతి పేరుతో జరిగిందని అప్పట్లో వైసీపీ నినదించింది. దానికి వైఎస్ జగనే సాక్షి. మరి, ఆ అవినీతి వెలికి వస్తుందా.? ఏడున్నర నెలల తర్వాత అమరావతిలో భూ కుంభకోణంపై దర్యాప్తు షురూ అయ్యిందిగానీ.. ఇందులో చాలా లుకలుకలు కన్పిస్తున్నాయి.
అమరావతి కోసం ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తే, 50 వేల ఎకరాల పైన అక్రమాలు జరిగాయని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దాంట్లో ప్రభుత్వ భూమినీ, అమరావతి చుట్టూ వున్న భూముల్నీ కలిపేశారు. ఇప్పుడేమో, మొత్తంగా 4 వేల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించాయని ప్రభుత్వం చెబుతోంది. విచారణ మొదలయ్యింది.. అందులో ఎంత అక్రమం.? ఎంత సక్రమం.? అన్నది తేలాల్సి వుంది.
భూముల సంగతి సరే, లక్ష కోట్ల అవినీతి మాటేమిటి.? భూముల్లో అక్రమాలు తేల్చి, బాధ్యుల్ని జైలుకు పంపి, ప్రభుత్వ ఖజానాకి అవినీతి సొమ్ముని జమ చేయాల్సిన బాధ్యత వైఎస్ జగన్ సర్కార్ మీద వుంది. అక్రమాలు నిజమేనంటూ అసెంబ్లీ సాక్షిగా నినదిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, లక్ష కోట్లు కాకపోయినా.. ఓ పది వేల కోట్ల రూపాయలైనా ప్రభుత్వ ఖజానాలో వెయ్యగలిగితే.. రాష్ట్ర ప్రజానీకమంతా ఆయనకి సెల్యూట్ చెయ్యాల్సిందే.
541980 54116Sweet web site , super layout, really clean and utilize genial . 507633
705781 97202TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Uncover it all in Teen Vogue 279297