తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వ్యవహారానికి ఆస్కారం లేకుండా, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అలా వెళ్ళడం కేసీఆర్కి కలిసొచ్చింది. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు జరిగి వుంటే, కేసీఆర్కి పెద్ద షాకే తగిలేదేమో.! ఆ స్థాయిలో లోక్సభ ఎన్నికలు కేసీఆర్కి ఝలక్ ఇచ్చిన విషయం విదితమే. సో, ఇదే ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అమలు చేయబోతున్నారా.? అంటే, అవునంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
కేసీఆర్లా మరీ నాలుగేళ్ళ తర్వాత కాకుండా, వైఎస్ జగన్ రెండు మూడేళ్ళలోనే ముందస్తు ఎన్నికలకు వెళతారన్నది ఆ చర్చల సారాంశం. నిజమేనా.? వైఎస్ జగన్ అంత రిస్క్ చేస్తారా.? ఆ ఆలోచనతోనే ముందూ వెనుకా ఆలోచించకుండా సంక్షేమ పథకాల్ని అమల్లోకి తెచ్చేస్తున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి వైఎస్ జగన్ ముందస్తు ఆలోచనలు చేయడంలేదనే విషయం స్పష్టమవుతోంది. కానీ, కేంద్రం జమిలి ఎన్నికల పేరుతో ముందస్తు ఎన్నికలు తీసుకొస్తే.. అందుకు సిద్ధంగా వుండాలి గనుక.. ఆ దిశగా ఖచ్చితమైన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
టీడీపీ వర్గాలు మాత్రం ముందస్తు ఎన్నికల మీద చాలా చాలా ఆశలు పెట్టుకుంటున్నాయి. జగన్ తప్పటడుగు వేస్తే, అది రాజకీయంగా తమకు కలిసొస్తుందన్నది టీడీపీ ఆలోచన. ఇంతకీ, ముందస్తు ఎన్నికలపై జనసేన ఆలోచన ఏంటి.? అంటే, ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏడాది లోపే, పార్టీని పూర్తిస్థాయిలో పటిష్టం చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రజా ఉద్యమాలతోనే పార్టీ బలోపేతమవుతుందన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కన్పిస్తోంది.
760408 892257An very fascinating read, I may possibly not agree completely, but you do make some extremely valid points. 455546
42239 290255Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to uncover somebody with some original ideas on this subject. realy appreciate starting this up. this excellent web site is something that is required over the internet, a person if we do originality. valuable work for bringing something new towards the web! 390760