‘రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేని విషయమిది..’ అంటూ చాలాకాలంగా జీవీఎల్ నరసింహారావు తదితర బీజేపీ నేతలు చెబుతూనే వున్నారు. ఇదే విషయాన్ని తాజాగా కేంద్రం, హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో తెలిపింది కూడా. అయితే, ఈ అఫిడవిట్.. 2018లో, అంటే చంద్రబాబు హయాంలో దాఖలైన పిటిషన్కి సంబంధించినది కాడం గమనార్హం. దాన్ని పట్టుకుని వైసీపీ నేతలు చేస్తోన్న యాగీ అంతా ఇంతా కాదు.
‘చంద్రబాబు అండ్ కో ఈ దెబ్బతో ఔట్.. కేంద్రం తేల్చి చెప్పేసింది, రాష్ట్ర రాజధాని వ్యవహారాల్లో మాకు సంబంధం లేదని..’ అంటూ వైసీపీ నేతలు హడావిడి చేసేస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ.. అదే అఫిడవిట్లో ప్రత్యేక హోదా సహా పలు అంశాల ప్రస్తావన వుంది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా.. వంటి అంశాలున్నాయి. మరి, వీటిపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎందుకు నోరు పెగలట్లేదు.?
‘మేం అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని ఇదే వైసీపీ, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. మరి, మెడలు వంచారా.? అంత సీన్ వైసీపీకి లేదు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడచిన ఏడాది కాలంలో పలు సందర్భాల్లో పరోక్షంగా సెలవిచ్చారు. ‘కేంద్రంలోని బీజేపీకి పూర్తి బలం వున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేదు..’ అని వైఎస్ జగన్ చేతులెత్తేశారు. ఇదీ, రాష్ట్రంపై వైసీపీ చిత్తశుద్ధి.
రాష్ట్రానికి మూడు కాకపోతే, ముప్పయ్ రాజధానులు కట్టుకోవచ్చు. కానీ, అసలంటూ తొలుత ఓ రాజధానిని అభివృద్ధి చేయాలి కదా.! చంద్రబాబు చెప్పిన లక్ష కోట్ల రాజధాని కాకపోయినా.. కనీసం ఓ పాతిక వేల కోట్ల రాజధానిని అయినా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించి తీరాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఆ తర్వాత, మరో రెండు రాజధానుల్ని టేకప్ చేయొచ్చు.. ఆ రెండూ పూర్తయ్యాక, ప్రభుత్వానికి మరిన్ని రాజధానుల్ని నిర్మించే ఆలోచన వచ్చినా తప్పుపట్టలేం.
ఒక్క రాజధాని అమరావతిని స్మశానంగా అభివర్ణిస్తూ, దాన్నే శాసన రాజధాని.. అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇంకోపక్క విశాఖ, కర్నూలు నగరాల్ని రాజధానులుగా ప్రకటించడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.? అధికారంలో వుంటే, అడ్డగోలుగా రాజధానులు ఏర్పాటు చేసెయ్యొచ్చా.? ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారిపోతాయా.? ఈ విషయమై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిందే. ఓ రాష్ట్రంలో రాజధాని పేరుతో ఇంత రచ్చ జురుగుతోంటే, కేంద్రం పట్టించుకోకపోవడాన్ని బాధ్యతారాహిత్యమని కాక ఇంకేమనాలి.? రాష్ట్రమిలా అడ్డగోలు రాజకీయాలతో సర్వనాశనమైపోతోంటే, ఈ సందట్లో హోదా వాదన వీగిపోతుందని బహుశా బీజేపీ పెద్దలు భావిస్తున్నారేమో.!
211834 74243Right after study some of the websites along with your internet internet site now, i truly as if your way of blogging. I bookmarked it to my bookmark website list and will likely be checking back soon. Pls appear at my website likewise and figure out what you believe. 529801