వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ‘వాలంటీర్ వ్యవస్థ’ని తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ‘సేవ’ చేస్తున్నారు.! వీరికి ఒక్కొక్కరికీ నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తోంది. సాక్షి పత్రిక కొనుగోలు చేసేందుు అదనంగా నెలకి 200 రూపాయలు చెల్లిస్తోంది ప్రభుత్వం. వీళ్ళంతా వైసీపీ వాలంటీర్లే.!
‘మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నాం..’ అని వైసీపీ నేతలు చాలామంది బహిరంగ సభల్లోనే చెప్పారు. మంత్రులూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేనా, వైసీపీకి అనుకూలంగా పని చేయకపోతే పీకి పారేస్తామంటూ వాలంటీర్లను హెచ్చరించారు కూడా.!
వైసీపీ కార్యకర్తలకు, ప్రభుత్వం తరఫున చెల్లింపులు చేస్తూ, దీనికి ‘వాలంటీర్ వ్యవస్థ’ అనే పేరు పెట్టారన్నమాట. వీరికి శిక్షణ ఇచ్చేందుకు మళ్ళీ అదనపు ఖర్చు. వృధా అవుతున్న వందల కోట్లు, వేల కోట్లు.. అంతా ప్రజాధనమే.!
ఇంతకీ, వాలంటీర్ వ్యవస్థకి బాస్ ఎవరు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈ ప్రశ్నను లేవనెత్తింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నకి సమాధానమేంటో తెలుసా.? పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్ళ గురించి వైసీపీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పెళ్ళిళ్ళ వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమైనా వుందా.? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందిన ప్రజాధనం ఏమైనా దుర్వినియోగం అవుతోందా.?
వాలంటీర్ల ద్వారా కలెక్ట్ చేస్తున్న డేటా ఎక్కడకు వెళుతోంది.? హైద్రాబాద్లోని సంస్థకు వాలంటీర్ వ్యవస్థ పేరుతో చేస్తున్న చెల్లింపుల సంగతేంటి.? వాలంటీర్లకు బాస్ ఎవరు.? ఈ మూడు ప్రశ్నలు జనసేనాని సంధించారు. వైసీపీ అధినేతే, వాలంటీర్లకు బాస్ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రే బాస్ అని కూడా చెప్పొచ్చు. చెప్పలేనంతలా వైసీపీ ఎందుకు ఇబ్బంది పడుతోంది.? వాలంటీర్ వ్యవస్థలో అక్రమాలు లేకపోతే సమాధానం చెప్పడానికి భయమెందుకు.?