ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారు ఎన్ని పనులతో బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం పరిపాలనకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో క్షణం కూడా ఖాళీ ఉండదు. దీంతో తమ సొంత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం వీలుపడదు.
రాష్ట్రం మొత్తాన్నిచూసుకునే క్రమంలో సొంత నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు. నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు అవసరాలు తీరాలంటే ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో తమకు నమ్మకంగా ఉండే ఓ నేతకు అక్కడి పనులు అప్పగించడం సర్వసాధారణం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సైతం ఇదే ఇబ్బంది కలిగింది.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ముఖ్యమంత్రి కావడంతో అమరావతిలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో తన నియోజకవర్గ ప్రజలను తరచుగా కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూసుకునే బాధ్యతను తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించారు.
ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలకు సంబంధించిన ఏ పనైనా అవినాష్ రెడ్డే చక్కబెడుతున్నారు. మరోవైపు అధికారులు సైతం అవినాష్ రెడ్ది నుంచి ఫోన్ వస్తే.. ఆగమేఘాల మీద ఆ పని పూర్తి చేస్తున్నారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి చూసుకునేవారు.
ఇప్పుడు జగన్ బదులు ఆయన సోదరుడు అవినాష్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జగన్ తమకు అందుబాటులో లేరనే భావన ప్రజల్లో కలగకుండా చూసుకోవడంలో విజయం సాధిస్తున్నారు. తద్వారా ప్రజల్లోనూ పరపతి పెంచుకుంటున్నారు.
741258 130986My plate is real full and your tryna give me far more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 371999