ఇటివల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు విషయంలో రమేశ్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ తో సంబంధం ఉన్న ముఖ్యమైన వ్యక్తులు అందరినీ విచారిస్తున్నారు. ఇందులో భాగంగా రమేశ్ హాస్పిటల్ లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మమతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మమత.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు. మమత ఇటివలే కరోనా బారిన పడి హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లిన పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ సీపీ ఆఫీస్ లో ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసుతో తన భార్యకు ఏ ప్రమేయం లేదని రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు అంటున్నారు. ఆమెను పోలీసులు విచారించడాన్ని ఆయన ఖండించారు. తమ కుటుంబంపై ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో పని చేస్తన్న తన భార్యకు విజయవాడలో జరిగిన ఘటనతోఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
రమేశ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేసారు. ఇక్కడ జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. ప్రస్తుతం రమేశ్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
289054 291726We clean up on completion. This may sound obvious but not several a plumber in Sydney does. We wear uniforms and always treat your home or office with respect. 601299
343077 527809But wanna comment which you have a really good internet site , I love the style and style it genuinely stands out. 468842
712112 533832I like this site its a master peace ! Glad I discovered this on google . 470327