లైగర్ తో ప్యాన్ ఇండియన్ ప్రయత్నం చేసాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఫలితం పూర్తిగా బెడిసికొట్టేసింది. ఈ నేపథ్యంలో వెంటనే తెరకెక్కే జనగణమన చిత్రాన్ని హోల్డ్ లో పెట్టి వరసగా తెలుగు చిత్రాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చేస్తోన్న విజయ్ ఆ తర్వాత మరో ఇద్దరు దర్శకుల కథలను కూడా ఓకే చేసాడు.
అయితే ఈ మూడు చిత్రాల తర్వాత కచ్చితంగా ప్యాన్ ఇండియన్ చిత్రమే ఉంటుందని తెలుస్తోంది. లైగర్ కు ముందే విజయ్ అంటే ఇంప్రెస్ అయిన కరణ్ జోహార్, విజయ్ తో ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు.
కథను సిద్ధం చేయిస్తున్నాడు. ఇదే క్రమంలో విజయ్ ను, బాలీవుడ్ సినిమాను హ్యాండిల్ చేయగల సౌత్ దర్శకుడి కోసం వేట కొనసాగిస్తున్నాడు కరణ్ జోహార్. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు దర్శకులతో సిట్టింగ్స్ అయినా కూడా ఫైనల్ అవ్వలేదు మరి.