విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత చేయబోయే చిత్రంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. సంక్రాంతి 2024కి సైంధవ్ విడుదలవుతుంది. దాని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ చిత్రాన్ని చేసే అవకాశముంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే కథ చకచకా రెడీ అవుతోందని సమాచారం.
స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూపతి రాజా ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ తో పాటు ఈ చిత్రంలో మరో హీరో కూడా నటించే అవకాశముందని టాక్. అయితే ఈ మల్టీ స్టారర్ లో మరో హీరోగా అక్కినేని నాగ చైతన్యను అనుకుంటున్నారట.
వెంకటేష్, నాగ చైతన్య ఇప్పటికే వెంకీ మామలో అలరించారు. అలాగే ప్రేమమ్ లో కూడా వెంకటేష్ కామియో ఉంటుంది. అన్నీ కుదిరితే మరోసారి ఇద్దరూ కలిసి అలరించనున్నారు.