ఓట్ల లెక్కింపునకు ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నేతలతోపాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. గెలుపు ఎవరి సొంతం అవుతుందో అని నరాలు తెగే టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేత మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు, అభిమానుల్లో గెలుపు తమదే అనే ధీమా కనపడుతుండగా.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒకటి రెండు సందర్భాల్లో మినహా బయట ఎక్కడా కనిపించలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు అన్ని పార్టీల అధినేతలూ స్పందించినా.. జగన్ మాత్రం తన నిశ్శబ్దాన్ని కొనసాగించారు. అధికారం తమదేనని, వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఇప్పటివరకు ఎక్కడా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఓటింగ్ ముగిసిన దగ్గర నుంచి ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పొత్తుల కోసం ఎవరి దగ్గర నుంచి ప్రతిపాదనలు వచ్చినా, ఫలితాల తర్వాత చూద్దాం అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబురు పంపినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేసినా.. అందరికీ జగన్ సమాధానం అదే. ఈ విషయంలో ఆయన ఎలాంటి తొందరపాటూ ప్రదర్శించడంలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నది జగన్ యోచనగా చెబుతున్నారు. అందువల్లే ఎంతటి సీనియర్ నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నా.. ఫలితాలు వచ్చాక చూద్దాం అని వారికి స్పష్టంచేస్తున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. పోలింగ్ దగ్గర నుంచి ఆయనలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈవీఎంలు సరిగా పనిచేయలేదంటూ వాటిపై పోరాటం మొదలుపెట్టిన ఆయన.. తర్వాత క్రమంగా గెలుపు తమదేనని ధీమా కనబరచడం ప్రారంభించారు. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, నూటికి వెయ్యి శాతం గెలుపు తమదేనని బాబు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఒకరిద్దరు మినహా టీడీపీ నేతలు, కేడర్లో ఈ భరోసా మాత్రం కనిపించడంలేదు. మరోవైపు ఫలితాలు రావడానికంటే ముందుగానే విపక్షాల్ని ఏకతాటి పైకి తీసుకురావడానికి బాబు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ, లక్నో, కోల్ కతా, బెంగళూరు వంటి నగరాలు వరుసపెట్టి చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల నేతల దగ్గరకూ విసుగు, విరామం లేకుండా తిరుగుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఫలితాల కంటే ముందే కూటమి కట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ ఆయన తాజాగా బుధవారం కుప్పంలో గంగమ్మ జాతరలో తొలిసారిగా పాల్గొని మొక్కు కూడా చెల్లించుకున్నారు.
మొత్తమ్మీద చంద్రబాబు, జగన్ ను పరిశీలిస్తే ఇద్దరి మధ్యా ఉన్న వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. గెలుపుపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు.. చంద్రబాబు మాత్రం గెలుపు తమదేనని స్పష్టంచేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మొద్దని బాబు చెప్పగా.. అసలు జగన్ వాటిపై ఎక్కడా స్పందించలేదు. పలు పార్టీల నుంచి జగన్ కు ఫోన్లు వస్తుండగా.. చంద్రబాబే పలు పార్టీల అధినేతల వద్దకు వెళుతున్నారు. వైఎస్సార్ సీపీ కేడర్, నేతల్లో జోష్ కనిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కేడర్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య పూర్తి వైరుధ్య పరిస్థితులు నెలకొని ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
115694 746881i would have to make more christmas cards becuase next month is december already- 627183
533158 923921Take a peek at the following ideas what follows discover perfect approach to follow such a mainly because you structure your small business this afternoon. earn cash 995395
530215 491359Music started playing anytime I opened this web site, so annoying! 708468